ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Moral Stories లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...

బలిదానం | నీతి కథలు | Moral Stories in Telugu | Balidhanam

కంకిపాడు అనే గ్రామంలో శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా తెలివి గలవాడు. కానీ డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కక్కూర్తి గల మనిషి. ఈ శర్మ ఏంచేసినా డబ్బు కోసమే చేస్తాడు. వడ్డీ వ్యాపారం చేసి, అధిక వడ్డీ గుంజి బాగా సంపాదించాడు. గ్రామంలో ఒక ఇల్లు, దగ్గరలో ఉన్న పట్టణంలో రెండు ఇల్లు నిర్మించుకున్నాడు. ఒకరోజు ఆ గ్రామానికి నలుగురు వ్యాపారులు వచ్చి బట్టలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అమ్మి బాగా డబ్బు సంపాదించారు. ఆ తర్వాత సంపాదించిన డబ్బుని వజ్రాలుగా మార్చి, నాలుగు వజ్రాలు కొన్నారు. ఒక్కొక్క వ్యాపారీ, ఒక వజ్రం చొప్పున తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళుండే నగరానికి తిరుగు ప్రయాణం కట్టారు. అయితే కాకతాళాయంగా శర్మ కూడా ఆ రోజే నగరానికి ప్రయాణం కట్టాడు. ముందు వ్యాపారులు నడుస్తున్నారు. వాళ్ళ వెనుకగా కాస్త దూరంలో శర్మ నడుస్తున్నాడు. ఇంతలో వాళ్ళకి ఒక అడవి ఎదురయింది. ఆ అడవిలో దొంగల బాధ అధికం అని ఆ వ్యాపారులు విని ఉన్నారు. దొంగలు ఎదురు పడి బాధిస్తే, వాళ్ళకి చిక్కాకుండా ఆ వజ్రాలని ఎలా కాపాడుకోవాలి అని ఆ వ్యాపారులు చింతించసాగారు. వాళ్ళు ఒక బావి గట్టున ఆగి దాహం తీర్చుకొన్నారు. అప్పుడు వారిలో ఒక వ్యాపారికి తట...

ఏనుగుని గెల్చిన కుందేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నీలగిరి అడవుల్లో గజేంద్ర అనే ఒక ఏనుగు రాజు తన మందతో కలిసి నివశిస్తూ ఉండేది. ఒకసారి అనావృష్టి పరిస్థితులు ఏర్పడి ఆ అడవిలోని పచ్చటి చెట్లలన్నీ ఎండిపోయాయి. చిన్న చిన్న నీటి గుంటల సైతం ఎండి పోయాయి. దాంతో గజేంద్రుడికి అతని ఏనుగులకి ఆహారం, నీరు దొరకటం గగనం అయిపోయింది. దాంతో అన్ని ఏనుగులు కలిసి తమ రాజైన గజేంద్రుడి దగ్గరికి గుంపుగా వెళ్ళి ప్రస్తుతం అడవిలో ఏర్పడ్డ కరువు వాతావరణం గురించి ఈ విధంగా వివరించాయి. ఓ రాజా! గత రెండు సంవత్సరాలుగా మన అడవిలో ఒక్క చుక్క వర్షం కూడా పడటం లేదు. ఎండాకాలంలో వర్షం అన్న మాట లేకున్నా సీతాకాలం, వర్షాకాలాల్లో సైతం వాన రాక పోవటం వల్ల ఈ అడవిలో పచ్చదనం అనేది కనుచూపు మేరలో కనిపించటంలేదు. అందువల్ల మన ఏనుగుల జాతి నీరు, ఆహారం లేకుండా అలమటించి పోతున్నాం. దానికి గజేంద్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. నా ప్రియమైన సోదరులారా! ప్రస్తుతం మన అడవిలో ఏర్పడ్డ అనావృష్టి పరిస్థిలులు తద్వారా ఏర్పడ్డ కరువు పరిస్థితులు నాకు తెలుసు. అయితే ఈ పరిస్థితులలో మనం ఏమి చెయ్యలో మన మంత్రిగారిని అడిగి తెసుకుందాం. అప్పుడు ఏనుగుల మంత్రి గణేశ్ లేచి నుంచొని రాజుగారికి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ ప్రభూ! నేడు...

చేటు తెచ్చిన సలహా | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం వేజండ్ల అనే గ్రామంలో పుల్లయ్య అనే నేత కార్మికుడు ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. పుల్లయ్య మగ్గం మీద బట్టలు నేసి, దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఉన్నంతలో హాయిగా జీవితం గడుపుతున్న పుల్లయ్యకి ఒకసారి ఒక సమస్య ఏర్పడింది. అదేంటంటే ఒకసారి అతని దగ్గరున్న మగ్గం విరిగి పోయింది. మళ్ళీ ఆ మగ్గాన్ని బాగుచేస్తేకానీ బట్టలు నేయలేడు. బట్టలు నేస్తేకానీ రోజు గడవదు. దాంతో పుల్లయ్య తన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి మగ్గం కోసం ఒక చెట్టును కొట్టి, చెక్కలు తెద్దామని అనుకున్నాడు. దాంతో ఉదయమే నిద్రలేచి, చద్దన్నం మూట కట్టుకొని, భుజాన గొడ్డలి వేసుకొని అడవికి బయలుదేరాడు. అడవికి చేరి, అక్కడున్న చెట్లను బాగా పరిశీలించాడు. ఏ చెట్టు తాలుకా చెక్క తన మగ్గానికి పనికి వస్తుందో అని. ఒక మంచి టేకు చెట్టుని ఎన్నుకొని దాన్ని నరకాటానికి గొడ్డలి ఎత్తాడు. సరిగ్గా అప్పుడు అతనికి వినబడింది ఒక మానవ స్వరం, ఆ స్వరం చెప్పిన మాట, మానవా, ఈ చెట్టుని నరకటం మానవా? పుల్లయ్య ఆశ్చర్యపడి చుట్టు చూసాడు. ఎవరూ కనబడలేదు. ఈ మాట అన్నది ఎవరో అర్థంకాక, పుల్లయ్య కాస్సేపు అలానే నిల్చుని, మళ్ళీ చెట్టు నరకటానికి గొడ...

నాగ పుత్రుడు | నీతి కథలు | Moral Stories in Telugu

ముమ్మిడివరం అనే గ్రామంలో భట్టుమూర్తి అనే వేదపండితుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. భట్టుమూర్తి నాలుగు వేదాలు, అష్టాదశ పురాణాలు జోపాసనపట్టిన మహామేధావి. ఆ దేశాన్ని పాలించే రాజుగారు సైతం భట్టుమూర్తిని గౌరవించేవారు. అనేక సార్లు భట్టుమూర్తికి రాజుగారు సన్మానాలు చేసారు. దాంతో భట్టుమూర్తికి డబ్బు, బంగారం విపరీతంగా పోగుపడింది. భట్టుమూర్తి దంపతులకి అన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకున్న ఏకైక లోటు సంతానం లేదు. ఆ దంపతులు పిల్లలు కలగాలని ఎందరో దేవుళ్ళకి మొక్కుకున్నారు. పుణ్యక్షేత్రాలు తిరిగారు. కానీ ఫలితం శూన్యం. ఒక రోజు భట్టుమూర్తి ఆ ఊరి అమ్మవారి గుడిలో రామాయణం పురాణం చెపుతుండగా, ఒక ఆయన వద్దకు వచ్చి ఇలా అడిగింది. "అయ్యా పంతులుగారు! పిల్లలు లేని దశరథుడు ఏదో యాగం చేస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టారని విన్నాను. ఆ యాగం పేరు ఏమిటో చెపుతారా?” ఆ ఆగంతకురాలు అడిగిన ప్రశ్నకు భట్టుమూర్తి ఉలిక్కి పడ్డాడు. కారణం తనకే పిల్లలు లేరు. తను కూడా ఏదైనా యాగం చేస్తే పిల్లలు పుడతారేమో... అన్న ఆలోచనలో ఉన్నాడు. అయితే ఏ యాగం చెయ్యాలి అన్న విషయం అతనికి స్పష్టంకాలేదు. తన మనస్సులోకి సందేహాన్ని ఆ స్త్రీ అడగటం ...

తొందరపాటు తనం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నల్లూరు అనే గ్రామంలో రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ ఊరి దేవాలయంలో పూజారిగా పని చేస్తూ ఉండేవాడు. రామశాస్త్రి అప్పుడప్పుడు ఆ ఊరి ప్రజలు తమ ఇళ్ళల్లో చేసుకొనే వ్రతాలు, పూజలను జరిపించి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి సంభావనలు తీసుకుంటూ కాలం గడిపేవాడు. రామశాస్త్రి భార్య సీతమ్మ ఆమె భర్త తెచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ ఉండేది. అయితే రామశాస్త్రి దంపతులకు ఉన్న ఏకైక బాధ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి పెండ్లి అయ్యి 10 సం॥ములు గడిచినా సంతాన భాగ్యం కలగలేదు. దాంతో రామశాస్త్రి ఆయన భార్య ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. తీర్థయాత్రలు చేసి అనేక మంది దేవుళ్ళకి మ్రొక్కుకున్నారు. చివరికి వాళ్ళ పూజలు ఫలించి రామశాస్త్రి భార్య సీతమ్మ ఒక పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. లేకలేక కలిగిన ఆ మగ బిడ్డకు ఏ లోపం కలగకుండా ఆ బిడ్డను పెంచసాగారు. రామశాస్త్రి ఇంట్లో ఒక ముంగిసని చాలా కాలంగా పెంచుకుంటున్నాడు. ముంగిస అంటే తెలుసు కదూ! అది ఉడత జాతికి చెందిన పెద్ద పరిమాణంలో ఉండే ప్రాణి. ముంగిసకు, పాముకి ఆజన్మ విరోధం ఉంది. ఎప్పుడైనా పాము, ముంగిస ఎదురెదురు పడి పోట్లా డుకుంటే ముంగిస తనతో పోరా...

గాడిద గుట్టు రట్టు అయింది | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం ముత్తు పల్లి అనే గ్రామంలో శీనయ్య అనే రజకుడు ఉండేవాడు. రజకుడు అంటే చాకలి అని అర్థం. ఊళ్ళో అందరి బట్టలు ఊరి చివర ఉండే పంటకాలువ ఒడ్డున ఉతికి, కాలువ గట్టున ఆరేసేవాడు ఆ శీనయ్య. ఉదయం గంజితాగి, తన గాడిద మీద మురికి గుడ్డల మూటలు పెట్టి, గాడిదను తొలుకుంటూ కాలువ గట్టుకి వెళ్ళటం, ఆ తర్వాత ఆ మురికి గుడ్డల్ని సున్నం, సబ్బు ఉపయోగించి కాలువలో శుభ్రంగా ఉతికి ఆరేసి, సాయంత్రం కాగానే ఆ బట్టలు చక్కగా మడతలు పెట్టి, మూట కట్టి మళ్ళీ గాడిదపై వేసి ఊళ్ళోకి వెళ్ళి ఉదయం బట్టలు వేసిన వాళ్ళకి ఉతికిన బట్టలు ఇచ్చి, మెల్లగా ఇంటికి చేరేవాడు. అయితే ఈ శీనయ్య పరమ పీనాశివాడు. తాను బాగా మూడు పుటలా తినేవాడు. పాపం బండచాకిరి చేసే అతని గాడిదకు సరిగా గడ్డి వేసేవాడు కాదు. ఇలా పాపం గాడిద చాలీచాలని ఆహారంతో గాడిద చాకిరీ చేస్తూ కాలం వెళ్ళదీస్తుంది. ఒకరోజు శీనయ్య దగ్గరలో ఉన్న నగరం అనే పట్టణంలో సంత జరుగుతుండటంతో సరుకులు కొందామని గాడిదను తీసుకొని బయలుదేరాడు. చాకలి శీనయ్యతో పాటు మంగలి జగ్గయ్య, గ్రామ పురోహితుడు శర్మ, ఇతర వ్యాపారులు సంతకి బయలు దేరారు. సంత అంటే ఏమిటో తెలుసా? పూర్వకాలంలో ఇప్పటిలాగా కిరాణా దుకాణాలు, షాపింగ్ హల్స్ లేవు క...

కాకి తెలివి | నీతి కథలు | Moral Stories in Telugu

ఒకానొక గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ఒక పెద్ద వేప చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద పాము పుట్ట ఉన్నది. ఆ ఊళ్ళో జనాలు నాగులచవితినాడు ఆ పాము పుట్టలో పాలు పొసి పూజలు చేస్తుండేవాళ్ళు. అందులో ఒక దుష్టబుద్ధి గల పాము ఉండేది. అదే చెట్టుపైన చిటారు కొమ్మల్లో ఒక కాకి జంట గూడుకట్టుకొని కాపురం చేస్తుండేది. కొన్నాళ్ళు గడిచాయి. ఆడ కాకి నాలుగు గుడ్లు పెట్టింది. మగ కాకి బయటికి వెళ్ళి ఆహారం తెచ్చి ఆడ కాకికి ఇస్తుండేది. ఆడ కాకి గూడు వదిలి బయటికి వెళ్ళకుండా తాను పెట్టిన గుడ్లపై కూర్చుని పొదుగుతూ ఉండేది. ఒక నెల రోజులకి కాకి గుడ్ల నుంచి చిన్న, చిన్న కాకి పిల్లలు బయటికి వచ్చాయి. నల్లగా, ముద్దుగా ఉన్న తమ పిల్లల్ని చూసి తెగ సంతోష పడ్డాయి కాకులు. మరి కాకి పిల్ల కాకికి ముద్దు అంటే అదే కదా! ఆ  ఒకరోజు ఆకాకుల జంట, పిల్లల్ని గూడులో వదిలేసి ఆహారం కోసం ఊళ్ళోకి వెళ్ళాయి. ఆ సమయం కొసమే వేచి ఉన్న క్రింద పుట్టలోని విష సర్పం చర,చారా పాకి చెట్టు మీదకు వెళ్ళింది. కాకి పిల్లలు హాయిగా గూడులో నిద్రపోతున్నాయి. వాటిని చూసిన పాము మెల్లగా పడగను ఆ కాకి గూడులో ఉంచి, ఆ గూడులో ఉన్న కాకి పిల్లల్ని గుడుక్కున మింగి, మెల్లిగా చ...

అపరిచితుడిని నమ్మరాదు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవులలో 'గజేంద్ర' అనే ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా పెద్దదిగా, మహాబలంగా ఉండేది. ఆ అడవిలో ఉండే అన్ని జంతువులు ఆ ఏనుగు ఆకారం, బలం చూసి హడలిపోయేవి. చివరికి కూౄరమృగాలైన పులి, సింహాలు కూడా గజేంద్ర దగ్గరకు కూడా వెళ్ళేవికాదు. ఇక ఆ గజరాజు దినచర్య పరమ అరాచకంగా ఉండేది. ఉదయం సూర్యోదయం కాగానే నిద్రలేచి అలా అడవి మధ్యలో ఉన్న పెద్ద కొలనులో దిగేది. ఆ తర్వాత గంటల కొద్దీ ఆ కొలనులో స్నానం చేయటం, నీళ్ళతో ఆడుకోవటం చేసేది. దాని తొండాన్ని ఆ కొలనులో ముంచి ‘బర్రున' చాలా నీళ్ళు పీల్చి, అన్ని వైపులకీ చిమ్మేది. ఆ కొలను చుట్టూ ఉన్న చెట్లపై ఆ ఏనుగు అలా . నీళ్ళు చిమ్మేసరికి ఉండే కోతులు, పక్షులపై నీళ్ళు ధారలు పడి ఊపిరి ఆడక గిల, గిలలాడి చెట్ల మీద నుంచి క్రింద పడి చచ్చేవి. ఆ తర్వాత స్నానం అయినాక, నీళ్ళ నుండి బయటికి వచ్చి తనకు నచ్చిన పెద్ద పెద్ద చెట్లను తొండంతో పెకిలించి లేతగా ఉండే చెట్ల కొమ్మల్ని హాయిగా భోంచేసేది. ఇంకా అడవిలో ఉండే పళ్ళ చెట్లను కూడా తొండంతో విరగ దీసి, ఆ చెట్ల పండ్లను తింటూ ఉండేది. ఆ ఏనుగు భారీ ఆకారం చూసి అది చేసే నిర్లక్ష్య చర్యల్ని అడ్డగించే సాహసానికి ఆ అడవిలో ఏ జంతువూ దిగలేదు...

దుష్టులతో స్నేహం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవులలో సంజీవి అనే సింహం ఉండేది. ఆ సింహం పేరుకి క్రూర మృగం అయినా చాలా మంచి గుణాలు కలిగి మంచి పేరు కలిగి ఉండేది. ఒక రకంగా ఆ అడవికి,ఆ సింహం రాజుగానే భావించవచ్చు. ఆ సింహానికి ఒక కాకి, ఒక నక్క ఒక తొడేలు మంచి స్నేహితులుగా ఉండేవి. రోజూ సాయంకాలం సింహం తన స్నేహితులతో కలిసి అడవిలో షికారు చేస్తూ, బాగా ఆకలైనప్పుడు మాత్రమే ఏదైనా జంతువును వేటాడేది. అలా సింహం చేత చంపబడ్డ జీవాన్ని కాకి, నక్క, తొడేలులతో కలిసి సింహం భుజించేది. ఒకరోజు సాయంకాలం సింహం దాని మిత్రులు అడవిలో సంచరిస్తుండగా, వాళ్ళకి ఒంటరిగా తిరుగుతున్న ఒక ఒంటె కన్పించింది. అది చూసిన సింహం, నక్కను పిల్చి ఇలా అన్నది. ఓయీ నక్క మిత్రమా!  అక్కడ ఓ ఒంటె ఒంటరిగా తిరుగుచున్నది. అది బహుశా ఎవరిదో వ్యాపారికి చెందిన ఒంటె కావచ్చు. దొవ తప్పి ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉన్నది. నీవు వెళ్ళి దాన్ని నా వద్దకు పిల్చుకు రా! దాంతో ఆ నక్క ఒంటె దగ్గరికి వెళ్ళి సింహం రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది. అప్పుడు ఒంటె సింహం దగ్గరికి వచ్చి నమస్కరించి నిల్చున్నది. అప్పుడు సింహం ఒంటెను కూడా తన మిత్రబృందంలో చేరమని ఆహ్వానించింది. ఆ అడవిలో దిక్కు, దివానం లేకుండ...

చేటు తెచ్చిన ఉత్సాహం | నీతి కథలు | Moral Stories in Telugu

సబ్బవరం అనే గ్రామంలో దేవుడి గుడి ఉంది. కానీ బడి లేదు. అందువల్ల ఆ ఊరి పిల్లలు చాలా దూరం నడిచి పట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ ఊరి పెద్దలు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారి దగ్గరకు వెళ్ళి తమ ఊరిలో ఒక పాఠశాలను నిర్మించమని ప్రార్థించారు. ఆ రాజుగారు విశాల హృదయుడే కాక, బాగా చదువుకున్నవాడు. దాంతో సబ్బవరం గ్రామంలో ఒక పాఠశాల నిర్మింస్తానని గ్రామ పెద్దలకి వాగ్దానం చేసి పంపేసాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఒక మంత్రిని పిలిచి ఇలా అన్నాడు. మంత్రి వర్యా! మీరు అవసరమైన ఆ ధనాన్ని, పనివాళ్ళని తీసుకొని సబ్బవరం గ్రామానికి వెళ్ళి, అక్కడ ఒక పాఠశాల భవనం నిర్మించి రండి. దానికి ఆ మంత్రి సరేనని కావాల్సివ ధనం మనుషుల్ని తీసుకొని సబ్బవరం బయలుదేరాడు. ఆ తర్వాత సబ్బవరం గ్రామ పెద్దలు చూపించిన విశాలమైన ఖాళీ స్థలంలో భారీపరిమాణంలో ఉండే ఒక పాఠశాల భవనాన్ని నిర్మించటం మొదలు పెట్టించాడు ఆ మంత్రి. పునాదులు లేచాయి. ఆ తర్వాత గొడలు కట్టబడ్డాయి. అయితే ఈలోగా ఒక సంఘటన జరిగింది. అదేమంటే ఆ భవన నిర్మాణం జరిగే స్థలానికి దగ్గరలో ఒక నేరేడు చెట్టు ఉన్నది. ఆ చెట్టుపై చాలా కోతులు పగలంతా ఆడుకుంటూ, నేరేడు కాయలు తింటూ కాలక్షేపం ...

పెద్దల మాట చద్ది మూట | నీతి కథలు | Moral Stories in Telugu

బిక్కవోలు అనే గ్రామంలో సత్తెమ్మ అనే వృద్ధురాలు జీవిస్తూ ఉండేది. ఆమెకు 'కామేశం' అనే మనవుడు ఉండేవాడు. సత్తెమ్మ కొడుకు కోడలు గోదావరీ నది వరదల్లో చనిపోగా పసి గుడ్డుగా ఉన్న 'కామేశాన్ని' .. గారాబంగా పెంచి పెద్ద చేసింది. ఎంత గారాబంగా పెరిగినా, కామేశం బాగా చదువుకుని, క్రమశిక్షణాతో జీవించేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కొన్నాళ్ళకి బిక్కవోలు గ్రామానికి దగ్గరగా ఉన్న పట్టణంలో ఉంటున్న ఒక సంపన్నుడి కుమార్తెను కామేశానికి ఇస్తామని పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా సత్తెమ్మకు కబురు చేసారు ఆ సంపన్నుడి బంధువులు. దాంతో సత్తెమ్మ మనవడికి ఈ విషయం చెప్పి, పట్నం వెళ్ళి పెళ్ళి కూతురిని చూసి రమ్మన్నది. సరే అని ప్రయాణానికి సిద్ధం అయ్యాడు కామేశం. అప్పుడు సత్తెమ్మ తన మనవడితో ఇలా అన్నది. నాయనా! కామేశం మనిషి ఎప్పుడూ ఒంటరిగా కొత్తచోటుకి వెళ్ళకూడదు. పోనీ నేను, నీకు తోడు వద్దామంటే నాకు కీళ్ళ నెప్పులు. అంత దూరం నడవలేను. అందువల్ల ఎవరినైనా తొడు తీసుకెళ్ళు అన్నది. ఆమె మాటల్ని తీసిపారేస్తూ కామేశం ఇలా అన్నాడు. పోబామ్మా! నీదంతా చాదస్తం నేనింకా పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు ఇరవై ఏళ్ళు వచ్చాయి తెలుసా? కామేశం మాటలకి నవ్వ...

నువ్వా? నేనా? | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వ కాలంలో ఒక ఊరి చివర ఉన్న స్మశానంలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టుపైన అనేక వందల కాకులు జీవిస్తూ ఉండేవి. ఆ కాకుల రాజు పేరు నీలపర్ణుడు. అంటే నీలం రంగు రెక్కలు గలవాడు అని అర్థం. ఆ స్మశానానికి రెండు క్రోసుల దూరంలో ఉన్న కొండ గుహలో వేల కొద్ది గబ్బిలాలు జీవిస్తూ ఉండేవి. వాటి నాయకుడు నిశిరాజు. అంటే రాత్రికి రాజు. అంటే చంద్రుడు అని అర్థం. ఇది ఇలా ఉండగా చెట్టుమీద ప్రశాంతంగా జీవిస్తున్న కాకులకి ఒక సమస్య వచ్చి పడింది. అదేమంటే కాకులకి రాత్రిపూట కనిపించదు. కానీ గుడ్ల గూబలకి రాత్రిళ్ళు మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. అది రాత్రిళ్ళు మాత్రమే ఆహారం కోసం గుహ బయటికి వస్తుంటాయి. అందుకే గుడ్లగూబల్ని నిశాచరులు అంటారు. అంటే రాత్రిళ్ళు సంచరించే వాళ్ళు అని అర్థం. గుడ్లగూబలకి, కాకులకి జన్మ విరోధం ఉన్నది. పైగా గుడ్లగూబలకి, కాకులు ఇష్టమైన ఆహారం. దాంతో గుహలోని గుడ్లగూబలు రాత్రి సమయంలో కాకులు నివాసం ఉంటున్న మర్రిచెట్టు పైకి దాడి చేసి కాకుల్ని చంపితింటూ ఉండేవి. ఇలా గుడ్లగూబల దాడిలో ఇంకా రెక్కలు రాని కాకి పిల్లలు సైతం మరణించేవి. తన పాలనలో ఉన్న కాకులు ఇలా దిక్కుమాలిన చావు చావటంతో ఆ కాకుల రాజైన నీలపర్ణుడు చాలా విచారించి, తన మ...

కుక్క కాటుకి చెప్పు దెబ్బ | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం ఓరుగల్లు అనే పట్టణంలో నారాయణ, శర్మ అనే ఇద్దరు ఆప్త మిత్రులు ఉండేవారు. వాళ్ళ స్నేహాన్ని చూసి ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆశ్చర్యపడేవాళ్ళు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకసారి నారాయణ తన కూతురికి పెళ్ళి చేయాలని అనుకున్నాడు. కానీ అతని దగ్గర తగినంత డబ్బులేక ఆగిపోయాడు. ఆ విషయం తెల్సిన శర్మ మిత్రుడి ఇంటికి వచ్చి ఒరేయ్ మూర్ఖుడా లక్షాధికారి అయిన నన్ను మిత్రుడిగా కలిగి ఉన్న నీవు కొద్దిపాటి డబ్బులేక కూతురు పెళ్ళి ఆపుతావా, నీకెంత కావాలో చెప్పు. ఇస్తా అన్నాడు. శర్మ మాటలు విని నారాయణ చాలా ఆనందించి మిత్రమా! నీ గుణం నాకు తెలుసు. కానీ ఎంత మిత్రుడివి అయినా డబ్బు అడిగి మన స్నేహాన్ని అగౌరవపరచటం ఇష్టం లేక నిన్ను అడగలేదు. నిజానికి నీ కన్నా నాకు ఎవరు ఆప్తులు అన్నాడు. సరే శర్మ బలవంతం మీద ఒక రెండు వేల రూపాయలు కూతురి పెళ్ళికోసం అప్పుగా తీసుకొని కూతురి పెళ్ళి ఘనంగా చేసి, తన బాధ్యత దింపుకున్నాడు నారాయణ. కొద్ది నెలలు గడిచాయి. ఒక రోజు నారాయణ దగ్గరికి వచ్చాడు శర్మ. మిత్రుడిని ఆదరంగా లోనికి పిలిచాడు నారాయణ. కాస్త సమయం గడిచాక శర్మ, నారాయణతో ఇలా అన్నాడు. ఇదిగో నారాయణా! నీవు నాకివ్వాల్సిన డబ్బు వెంటనే ఇచ్చ...

మోసకారి నక్క | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నేపాల్ అడవుల్లో ఒక మృగరాజు ఉండేది. దానికి ఒక నక్క, ఒక తొడేలు సలహాదారులుగా ఉండేవి. ఒకసారి ఆ సింహం ఒక ఆడ గుర్రాన్ని చంపింది. ఆ తర్వాత దాని పొట్ట చీల్చగా అందులో సజీవంగా ఉన్న ఒక గుర్రపు పిల్ల కనిపించింది. ఆ గుర్రపు పిల్లను చూసి సింహానికి జాలి వేసి దాన్ని చంపకుండా తన వద్ద ఉంచుకుని పెంచసాగింది. కాలక్రమంలో ఆ గుర్రపు పిల్ల పెద్ద గుర్రంగా మారింది. సింహానికి సలహాదారులుగా ఉన్న నక్క, తొడుళ్ళకు ఆ బలిసిన గుర్రాన్ని చూస్తే నోరు ఊరేది. కానీ ఆ గుర్రం రాజుగారి పెంపుడు బిడ్డతో సమానం కనుక నొర్మూసుకొని ఉన్నాయి. ఒకసారి ఆ సింహం ఒక అడవి దున్నల గుంపుపై దాడిచేసింది. అయితే ఆ మదించిన దున్నలు సింహాన్ని తమ కొమ్ములతో తీవ్రంగా గాయపరిచాయి. దాంతో సింహానికి చచ్చినంత పని అయింది. అలా అడవి దున్నల వల్ల తీవ్రంగా గాయపడ్డ సింహం బలహీన పడింది. దాంతో అది గుహ దాటి బైటికి వెళ్ళటం మానేసింది. ఒకరోజు ఆ సింహం నక్క, తొడేలును పిలిచి ఏదైనా జంతువును మన గుహలోకి తరుముకు రండి దాన్ని నేను చంపేస్తాను. మనం హాయిగా దాన్ని తిందాం అన్నది. ఇక రాజుగారి మాట తీసివేయలేక తొడేలు, నక్క అడవి అంతా తిరిగాయి ఏదైనా జంతువు కనిపిస్తుందేమో అని కానీ వాటి దురద...

భుజాలెక్కే భూతం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చందొలు అడవులలో “పాపాసురుడు” అనే బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వాడు పరమకూౄరుడు. తనకు లభించిన మనుషుల్ని నిర్ధాక్షిణ్యంగా నమిలి మింగేసేవాడు. వాడి కూృరత్వానికి ఎందరో బాటసారులు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఈ రాక్షసుడు ఒక ఎత్తైన బండరాయిపై కూర్చుండి, అటువైపుగా వచ్చిపోయే మనుషుల్ని దగ్గరికి పిలిచి, చంపి తినేసేవాడు. ఇలా ఆ బ్రహ్మరాక్షసుడి దుర్మర్గాలు కొనసాగుతున్నాయి. దాంతో తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ మార్గంలో ప్రయాణించేవాళ్ళు కారు. కారణం వాళ్ళకి తెలుసు. ఆ మార్గంలో బ్రహ్మరాక్షసుడు ఉంటాడని. ఒకరోజున రాజయ్యఅనే పల్లిటూరి వ్యక్తి నగరం నుండి, చందోలు వెళ్తూ, రెండు ఊళ్ళ మధ్యలో ఉన్న చందొలు అడవుల కుండా నడుస్తుండగా, బ్రహ్మరాక్షసుడి పిలుపు వినబడింది. ఆ భయంకర స్వరానికి రాజయ్యకి హడలు పుట్టింది. సరే ధైర్యాని చిక్కాబట్టికొని, ఆ పిలుపు వినవచ్చిన వైపు నడిచాడు. అక్కడ పెద్ద రాతిబండ మీద తాపీగా కూర్చుని ఉన్న పాపాసురుడు కన్నించాడు. దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడిని చూడగానే రాజయ్యకు గొంతు తడారిపోయింది భయంతో... అప్పుడు ఆ రాక్షసుడు గట్టిగా అరిచాడు. ఓరి మానవుడా! ఏమిటి నీ పేరు అని, దడ, దడ లాడుతున్న గుండెను నిగ్రహిం...

మూర్ఖులకి సలహా ఇస్తే? | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం పాడేరు అడవులలో సంజీవి అనే బుల్, బుల్ పిట్ట ఒక పనస చెట్టు కొమ్మలపై నివాసం ఉండేది. ఆ పిట్ట నలుగురికి మంచి సలహాలు ఇస్తూ మంచి పేరు పొందింది. ఒక చలికాలం చలి తీవ్రంగా ఉన్నది. మామూలు ప్రాంతాలలోనే చలికాలం చలి అధికం, అలాంటిది కొండలపైన ఉన్న పాడేరు అడవులలో చలి ఎలా ఉంటుందో వర్ణించటానికి వీలుకాదు. అలాంటి సమయంలో నాల్గు కోతులు, ఆ అడవిలో చలికి తట్టుకోలేక గజ, గజ వణుకుతూ బుల్, బుల్ పిట్ట నివాసం ఉన్న పనస చెట్టు క్రింద ముడుచుకొని కూర్చున్నాయి. అలా చలికి వణికిపోతున్న కోతుల్లో ఒక పిల్ల కోతి ఇప్పుడు చలి మంట వేసుకుంటే బలే హాయిగా ఉంటుంది అన్నది. పిల్లకోతి మాటలు విన్న ఒక ముసలి కోతి గబ గబా నాల్గు చితుకులు పొగేసింది. ఇక చలి మంట కోసం నిప్పు కావాలి. నిర్మానుష్యమైన ఆ అడవిలో నిప్పు ఎవరిస్తారు కోతులు విచారించాయి. ఇంతలో వాటికి గాలిలో ఎగురుతూ తళ, తళమని మెరుస్తున్న మిణుగురు పురుగులు కనిపించాయి. వాటిని చూసి కోతులు నిప్పుగా భావించి రెండు మిణుగురు పురుగుల్ని పట్టి చితుకుల మధ్య ఉంచి నిప్పు రాజేయటానికి నోటితో ఊదసాగాయి. నిజానికి మిణుగురు పురుగులు అలా మెరుస్తాయి కానీ వాటిలో ఎలాంటి నిప్పు మంట ఉండదు. కానీ ఈ విషయం అర్థం కాన...