ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది. 

ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వదిలి రమ్మని ఆజ్ఞాపించింది. దాంతో భటులు ఆ జింక పిల్లను తీసుకెళ్ళి అడవిలో వదిలేసారు. అంతే జింకకు మళ్ళీ బ్రతికినట్టుగా అనిపించి, తన తల్లిదండ్రులు ఉండే చోటికి పరిగెత్తింది. పాపం దాని దురదృష్టం వలన దాని కుటుంబం ఎటో వెళ్ళిపోయింది. దాంతో జింక పిల్ల నిరాశగా ఆ అడవిలో మిగిలి పోయింది. ఆ తర్వాత ఆ జింక పిల్లకు మూడు ప్రాణులతో మంచి స్నేహం ఏర్పడింది. అవేంటో తెలుసా, ఒక తాబేలు, ఒక ఎలుక, ఒక కాకి. అలా జింక వాటితో స్నేహం చేస్తూ, తల్లిదండ్రులు లేని బాధను మర్చిపోయి హాయిగా కాలం గడపసాగింది. 

ఇలా నెలలు గడిచాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రాంతనికి వేట ఆడటానికి వచ్చాడు. వేటగాడిని చూడగానే జింక ఒక్కగెంతులో అడవి లోపలికి పారిపోయింది. కాకి రివ్వున గాలిలోకి ఎగిరింది. ఎలుక దగ్గరలో ఉన్న తన కలుగులో చటుక్కున దూరిపోయింది.

పాపం బండ తాబేలు నిదానంగా పాకుతూ దగ్గరలో ఉన్న పొదలోకి జారుకొవాలని ప్రయత్నం చేసింది. కానీ దాని దురదృష్టం కొద్దీ వేటగాడి చేతులకి చిక్కిపోయింది.

ఆ వేటగాడు చిక్కిందే చాలు, ఈ రోజు ఆహారం దొరికింది అనుకుంటూ తాబేలు కాళ్ళు నాలుగు తాడుతో కట్టేసి భుజాన వేసుకుని అడవిలోంచి తన గ్రామానికి నడవసాగాడు.

వేటగాడు వెళ్ళిన పది నిముషాలకి జింక, ఎలుక, కాకి సమావేశం అయి, తమ మిత్రుడు తాబేలు వేటగాడికి చిక్కిందే అని దుఃఖించారు. అప్పుడు ఎలుక ఇలా అన్నది. చెయ్యాల్సిన పని చేయకుండా, విచారిస్తూ కూర్చొంటే మన మిత్రుడు ఎలా బ్రతుకుతాడు. కనుక మన ప్రయత్నం మనం చేద్దాం. ఆపై దేముడే అన్నీ చూసుకుంటాడు. ఎలుక మాటలు నిజమేననిపించాయి కాకి, జింకలకి దాంతో అవి ఎలాగైనా మన మిత్రుడిని ఆ వేటగాడి బారి నుండి రక్షించాలి, ఏదైనా పథకం చెప్పు అని ఎలుకని అడిగాయి. ఎలుక కసేపు ఆలోచించి ఇలా అన్నది.

ఈ వేటగాడు తన గ్రామం చేరాలంటే దొవలో ఒక వాగుని దాటాల్సి ఉంటుంది మనం ఆ వాగు దగ్గర కాపు వేసి, ఆ వేటగాడిని బురిడీ కొట్టించి, మన తాబేలు మిత్రుడిని రక్షించాలి.

ముగ్గురు మిత్రులు అడ్డదారిలో ప్రయాణించి ఆ వేటగాడి కన్నా ముందుగానే వాగు ఒడ్డుకు చేరుకున్నాయి. దూరంగా వస్తున్నా వేటగాడిని గమనించి ఎలుక, తన పథకాన్ని కాకి, జింకలకి వివరించింది. వేటగాడు వాగు దగ్గరికి వచ్చేసరికి ఎలుక వేసిన వ్యూహం ప్రకారం జింక చచ్చిపోయిన దానిలా వాగు ఒడ్డున పడిపోయింది. 

అలాగే కాకి కూడా పథకంలో భాగంగా చచ్చినట్లు నటిస్తున్న జింకను పొడిచి తింటున్నట్టుగా నటించసాగింది. చచ్చి పడుకున్న జింకను గమనించిన వేటగాడు చాలా సంతోషించి ఆ జింకను తీసుకొందామని తాబేలును క్రింద పెట్టి, జింకకేసి నడిచాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఎలుక, చటుక్కున వెళ్ళి తాబేలును కట్టిపడేసిన తాళ్ళను పట, పట కొరికి పారేసింది.

వేటగాడు సరిగ్గా తనకి 12 అడుగుల దూరంలోకి రాగానే చచ్చినట్టున్న జింక చివ్వున లేచి పరిగెత్తింది. కాకి కూడా గాలిలోకి ఎగిరింది. వేటగాడు జింక ఆడిన నాటకానికి ఆశ్చర్యపడి కనీసం తాబేలునైనా దక్కించుకొందామని వెనక్కి తిరిగి వెళ్ళిచూసే సరికి వాగులోకి దిగుతున్న తాబేలు కనిపించింది. దాంతో వేటగాడికి వెర్రివెక్కి పోయింది.

ఇంతలో కాకి వేగంగా ఎగిరి వేటగాడి కళ్ళను పొడిచింది. దాంతో వేటగాడు కళ్ళు పోయి భయంతో బెదిరిపోయి వేగంగా వాగు దాటి తన గ్రామంలోకి పరిగెత్తాడు. ఆ తర్వాత కాకి, తాబేలు, జింక, ఎలుక చాలా కాలం ఆ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ, స్నేహంగా జీవించాయి. ఇక కాకిచే గాయపడ్డ వేటగాడికి ఒక కన్ను పోయింది. దాంతో వేటాడటం మానేసి ఏవో పని, పాటలు చేసుకుంటూ జీవితం గడిపాడు. 


నీతి : ఆపదలో ప్రాణాన్ని నిలిపేవాడే నిజమైన స్నేహితుడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...