ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మూర్ఖులకి సలహా ఇస్తే? | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం పాడేరు అడవులలో సంజీవి అనే బుల్, బుల్ పిట్ట ఒక పనస చెట్టు కొమ్మలపై నివాసం ఉండేది. ఆ పిట్ట నలుగురికి మంచి సలహాలు ఇస్తూ మంచి పేరు పొందింది.

ఒక చలికాలం చలి తీవ్రంగా ఉన్నది. మామూలు ప్రాంతాలలోనే చలికాలం చలి అధికం, అలాంటిది కొండలపైన ఉన్న పాడేరు అడవులలో చలి ఎలా ఉంటుందో వర్ణించటానికి వీలుకాదు.

అలాంటి సమయంలో నాల్గు కోతులు, ఆ అడవిలో చలికి తట్టుకోలేక గజ, గజ వణుకుతూ బుల్, బుల్ పిట్ట నివాసం ఉన్న పనస చెట్టు క్రింద ముడుచుకొని కూర్చున్నాయి. అలా చలికి వణికిపోతున్న కోతుల్లో ఒక పిల్ల కోతి ఇప్పుడు చలి మంట వేసుకుంటే బలే హాయిగా ఉంటుంది అన్నది.

పిల్లకోతి మాటలు విన్న ఒక ముసలి కోతి గబ గబా నాల్గు చితుకులు పొగేసింది. ఇక చలి మంట కోసం నిప్పు కావాలి. నిర్మానుష్యమైన ఆ అడవిలో నిప్పు ఎవరిస్తారు కోతులు విచారించాయి. ఇంతలో వాటికి గాలిలో ఎగురుతూ తళ, తళమని మెరుస్తున్న మిణుగురు పురుగులు కనిపించాయి. వాటిని చూసి కోతులు నిప్పుగా భావించి రెండు మిణుగురు పురుగుల్ని పట్టి చితుకుల మధ్య ఉంచి నిప్పు రాజేయటానికి నోటితో ఊదసాగాయి.

నిజానికి మిణుగురు పురుగులు అలా మెరుస్తాయి కానీ వాటిలో ఎలాంటి నిప్పు మంట ఉండదు. కానీ ఈ విషయం అర్థం కానీ ఆ మూర్ఖపు మర్కటాలు చితుకుల్ని పడీ, పడీ ఊదసాగాయి. కానీ వాటి ఊపిరి పోయేదాకా వూదినా ఆ కట్టిలు మండలేదు. కోతులు చేస్తున్న ఈ బుద్ధిహీన చర్యలకి చెట్టు పైనున్న బుల్, బుల్ పిట్ట ఇలా అన్నది.

“ఓరీ మూర్ఖులారా! ఆ పురుగులు కట్టెల మధ్య ఉంచి, వూదితే నిప్పు రాజుకోదు. నా మాట వినండి-

మీ వృథా చర్యను మానండి. సరిగ్గా గుప్పెడంత కూడా లేని ఈ పాడు పక్షి, మాకు సలహా చెప్పేపాటిదా? పైగా మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళు అనినిందిస్తుందా... దీనికెంత ధైర్యం అని కోతులు వాటిలో అవి అనుకున్నాయి. కానీ ఆ పిట్ట అవేమీ పట్టించుకోకుండా ఓ బుద్ధిహీన మర్కాటలారా! నేను ఎంతగా చెప్పినా వినరేమిటి -

ఆ పురుగులని ఎంత ఊదినా నిప్పు రాజుకోదు అన్నది. అసలే భరించలేని చలి ఆపై ఎంత ఊదినా ఆ పురుగుల వల్ల నిప్పురాచుకోవటం లేదు. పైగా పైనుండి పిట్ట సలహాలు, ఇక సహనం నశించింది ఆ మూర్ఖపు కోతులకు. అంతే ఓ వృద్ధ వానరం క్షణాల్లో ఆ పనస చెట్టు ఎక్కి అదే పనిగా హితబోధ చేస్తున్న బుల్, బుల్ పిట్టని గుప్పెడుతో పట్టుకుని పై నుండి క్రిందికి విసరి కొట్టింది బలంగా.

అంతే అంత ఎత్తు నుండి విసురుగా నేలపై పడ్డ ఆ బుల్లి పిట్ట చచ్చి ఊరుకుంది. ఆపై చాలా సేపు మంట రాజేయటానికి విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ మక్కటాలు విసుగు పుట్టి, అక్కడి నుండి లేచి, వేరే చోటుకి వెళ్ళిపోయాయి.

నీతి : మూర్ఖులకి సలహాలు ఇచ్చిన వాళ్ళకి ప్రమాదం తప్పదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...