ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది.

గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది.

అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం.

పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది.

ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది.

అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తనే. అదెలానంటే యజమాని కనబడగానే కుక్క తోక ఆడిస్తుంది. ఆపై ముందరి కాళ్ళు పైకెత్తి, యజమాని ఛాతిపై వేసి యజమానిని నవ్విస్తుంది. ఇలా ఆలోచించిన గాడిద తాను కూడా కుక్కలాగే చేసి యజమాని మెప్పును పొందాలని గట్టిగా నిర్ణయిం తీసుకొంది.

అంతే ఆ రోజు నుండి గాడిద ప్రవర్తన మారిపోయింది. యజమాని పాపయ్య కనిపించినప్పుడల్లా, తోక ఆడించటం మొదలు పెట్టింది. పాపయ్య ఇది గమనించినా, ఏమి పట్టంచుకోలేదు.

ఆ తర్వాత ఒక రోజు పాపయ్య స్నానం చేసి, వాకిట్లో అరుగు పై కూర్చుని ఉండగా, గాడిద పాపయ్యకు ఎదరుగా నుంచుని రెండు కాళ్ళు అతడి ఛాతీపై ఉంచి, వేగంగా తోకను ఊపసాగింది.

దాంతో పాపయ్యకు దడ పుట్టింది. దీని సిగతరగా ఈ గాడిదకి గానీ పిచ్చెక్కలేదు కదా అనుకున్నాడు. కానీ ఆ సారి గాడిదని ఏమీ అనకుండా వదిలేసాడు.

దాంతో గాడిదకు ధైర్యం పెరిగి పోయింది. ఒకసారి పాపయ్య గోచీ పెట్టుకుని, ముక్కాలి పీటపై కూర్చుని, భార్యతో ఒంటికి నలుగు పెట్టించుకుంటున్నాడు.

ఇంతలో ఎవరో వచ్చి పిలుస్తే, అతని భార్య వీధిలోకి వెళ్ళింది. ఇంతలో అటువచ్చిన గాడిద, ముక్కాలి పీటపై కూర్చుని ఉన్న పాపయ్యను చూసి తోక ఆడిస్తూ, అతని భుజాలపై తన ముందు కాళ్ళు పెట్టింది.

దాంతో హడాలిపోయిన పాపయ్య తన గాడిదకు పిచ్చి ఎక్కింది. అని నిద్దాంరించుకొని, దాన్ని తీసుకెళ్ళి దొడ్లో ఉన్న ఒక చెట్టుకి కట్టేసి, ఒక బడిత తీసుకొని దాన్ని చావబాది వదిలి పెట్టాడు. దాంతో గాడిదకు యజమాని మెప్పును పొందాలన్న ఆశ చచ్చిపోయింది.

యజమాని కొట్టిన దెబ్బలకు మూలుగుతూ గాడిద తనలో తాను ఇలా ఆలోచించుకోసాగింది. నేను చేసిన పనులు ఆ కుక్క చేస్తే ముద్దుగా చూసిన యజమాని తను చేస్తే, ముద్దు చెయ్యక పోగా, చావబాదాడు. ఇదేంటి ఇలా జరిగింది.

నాకు కుక్కకీ ఉన్న తేడా ఏమిటి? ఇలా ఆలోచిస్తూ దెబ్బల బాధకి పెద్దగా ఓండ్రి పెట్టింది. దాంతో పాపయ్య ఇంట్లోంచి బయటికి వచ్చి గాడిదను ఇంకొసారి కర్రతో చావబాదాడు.

ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే, వాళ్ళకి రావాల్సిన గుర్తింపు వస్తుంది. ప్రక్క వాడిని చూసి అసూయపడి తనవి కాని పనులు చేస్తే బాధే మిగులు తుంది.

పులిని చూసి అసూయపడి ఒక నక్క తన శరీరం అంతా వాతాలు పెట్టుకొని, పులి అంతదాన్ని అయ్యానని అనుకొన్నది. వాతలు మిగిలాయి. నక్క నక్కే అవుతుంది కానీ పులిలా ఏనాటికీ కాలేదు. 

నీతి : అసూయపడిన వాళ్ళకి కష్టాలు తప్పవు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...