ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కుక్క కాటుకి చెప్పు దెబ్బ | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం ఓరుగల్లు అనే పట్టణంలో నారాయణ, శర్మ అనే ఇద్దరు ఆప్త మిత్రులు ఉండేవారు. వాళ్ళ స్నేహాన్ని చూసి ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆశ్చర్యపడేవాళ్ళు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకసారి నారాయణ తన కూతురికి పెళ్ళి చేయాలని అనుకున్నాడు. కానీ అతని దగ్గర తగినంత డబ్బులేక ఆగిపోయాడు.

ఆ విషయం తెల్సిన శర్మ మిత్రుడి ఇంటికి వచ్చి ఒరేయ్ మూర్ఖుడా లక్షాధికారి అయిన నన్ను మిత్రుడిగా కలిగి ఉన్న నీవు కొద్దిపాటి డబ్బులేక కూతురు పెళ్ళి ఆపుతావా, నీకెంత కావాలో చెప్పు. ఇస్తా అన్నాడు.

శర్మ మాటలు విని నారాయణ చాలా ఆనందించి మిత్రమా! నీ గుణం నాకు తెలుసు. కానీ ఎంత మిత్రుడివి అయినా డబ్బు అడిగి మన స్నేహాన్ని అగౌరవపరచటం ఇష్టం లేక నిన్ను అడగలేదు. నిజానికి నీ కన్నా నాకు ఎవరు ఆప్తులు అన్నాడు. సరే శర్మ బలవంతం మీద ఒక రెండు వేల రూపాయలు కూతురి పెళ్ళికోసం అప్పుగా తీసుకొని కూతురి పెళ్ళి ఘనంగా చేసి, తన బాధ్యత దింపుకున్నాడు నారాయణ.

కొద్ది నెలలు గడిచాయి. ఒక రోజు నారాయణ దగ్గరికి వచ్చాడు శర్మ. మిత్రుడిని ఆదరంగా లోనికి పిలిచాడు నారాయణ. కాస్త సమయం గడిచాక శర్మ, నారాయణతో ఇలా అన్నాడు. ఇదిగో నారాయణా! నీవు నాకివ్వాల్సిన డబ్బు వెంటనే ఇచ్చేయ్యాలి.

శర్మ మాటలకి కొంత ఆశ్చర్యపడ్డ నారాయణ త్వరలో ఇచ్చేస్తాను అన్నాడు. అదేం వీలుకాదు నాకు నా డబ్బు అయినా తిరిగి ఇవ్వు. లేదా నీ ఇల్లు అయినా నాకు రాసి ఇవ్వు అన్నాడు. కొంచెం అక్కసుగా. శర్మ మాటలతో నారాయణకి, శర్మ ఎంత కుత్సితుడో అర్థమయి. నీ డబ్బు ఒక వారంలో ఇస్తా అన్నాడు కొంచెం రోషంగా. అప్పుడు శర్మ అదేం కుదరదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వు. లేదా రాజుగారి దగ్గరికి వచ్చి నీ ఇంటి మీద నా దగ్గర అప్పు తీసుకున్నానని అంటే తాకట్టు పెట్టానని చెప్పు అన్నాడు. అక్కసుగా.

దానితో నారాయణ ఇంత చిన్న విషయానికి రాజుగారి దగ్గరికి ఎందుకు అన్నాడు. కానీ శర్మ, నారాయణను రాజుగారి దగ్గరికి వచ్చి తీరాలని పట్టుపట్టాడు. దాంతో నారాయణకు అర్థమయింది. ఈ శర్మ దురాశతో తన ఇల్లు ఏదో విధంగా కాజేయాలని చూస్తున్నాడని. సరే అంత సన్నిహిత మిత్రుడే ద్రోహిగా మారి తనని వంచించాలని చూస్తున్నప్పుడు ఇంకా మంచిగా ఉండి ప్రయోజనం ఏముంది అని భావించి శర్మతో ఇలా అన్నాడు.

శర్మా! నీకు తెలుసు నేను చాలా పేదవాడినని, రాజాస్థానానికి వెళ్ళాలంటే మంచి మంచి దుస్తులు, చెప్పులు తలపాగా, భుజంపై పట్టు కండువా, వెళ్ళటానికి గుర్రపు బండీ కావాలి అవి నా దగ్గర లేవు. అప్పుడు శర్మ, నారాయణ నీవు అడిగినవి అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు బయలుదేరు అన్నాడు ఆత్రంగా.

శర్మ ఇచ్చినవి ధరించి గుర్రపు బండీ ఎక్కి, రాజుగారి దర్బారుకి వెళ్ళాడు నారాయణ. అతని తర్వాత శర్మ కూడా రాజదర్బారీకి చేరాడు. రాజదర్బారులో ఒక మంత్రి, ధన సంబంధ వివరాలు పరిష్కరిస్తూ ఉంటాడు. ఆ మంత్రిని ముందుగా నారాయణ కలిసి, మంత్రి వర్యా! నా మిత్రుడు శర్మకి ఈ మధ్య చిత్తచాంచల్యం వచ్చి, నావన్నీ తనవే అనీ, అవన్నీ తనకి తిరిగి ఇచ్చేయాలని పట్టుబడుతున్నాడు అన్నాడు.

నారాయణ చెప్పింది విన్న న్యాయశాఖ మంత్రి శర్మను తన వద్దకు తీసుకురమ్మని భటుడ్ని పంపాడు. క్షణాల్లో శర్మ న్యాయమంత్రి దగ్గర హాజరు పరచబడ్డాడు. అప్పుడు నారాయణ, శర్మతో ఇలా అన్నాడు. శర్మా! నేను ధరించిన ఈ పట్టు బట్టలు, పట్టు కండువా ఎవరివి?

దానికి శర్మ అవును, నీవు ధరించిన బట్టలు నావే అన్నాడు. తర్వాత నారాయణ నేను ధరించిన తల పాగా ఎవరిది అన్నాడు. వెంటనే శర్మ నీవు ధరించిన పాద రక్షలు తలపాగా నావే అన్నాడు.

అప్పుడు నారాయణ చూసారా మంత్రిగారు, ఈ శర్మ ధోరణి నేను కట్టుకున్న దుస్తులు కూడా తనవే అంటున్నాడు. ఇంకాసేపు ఆగితే నేను వచ్చిన నా గుర్రపు బండీ కూడా తనదే అని అనగలడు అన్నాడు. భయం నటిస్తూ... వెంటనే శర్మ కోపంగా ఒరేయ్ నారాయణ నీకెమన్నా పిచ్చా, నా బట్టలు, చెప్పులు, తలపాగా తీసుకొని ఇప్పుడు నావి కాదంటావా పైగా నా గుర్రపు బండీ, నీది అని చెపుతున్నావా అని అరిచాడు.

దాంతో న్యాయమంత్రి ఇలా అన్నాడు. ఈ శర్మకు మతి చలించింది. కనుక ఇతను చెప్పే మాటలు నేను నమ్మను అన్నాడు. అక్కడున్న జనాలు కూడా శర్మను చూసి హేళనగా నవ్వారు. దాంతో శర్మకు పరువు పోయి, ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ, మిత్రుడి ద్రోహానికి తగిన ప్రతీకారం చేసాడు.

నీతి : మేధస్సు ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...