ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చేటు తెచ్చిన ఉత్సాహం | నీతి కథలు | Moral Stories in Telugu

సబ్బవరం అనే గ్రామంలో దేవుడి గుడి ఉంది. కానీ బడి లేదు. అందువల్ల ఆ ఊరి పిల్లలు చాలా దూరం నడిచి పట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ ఊరి పెద్దలు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారి దగ్గరకు వెళ్ళి తమ ఊరిలో ఒక పాఠశాలను నిర్మించమని ప్రార్థించారు. ఆ రాజుగారు విశాల హృదయుడే కాక, బాగా చదువుకున్నవాడు. దాంతో సబ్బవరం గ్రామంలో ఒక పాఠశాల నిర్మింస్తానని గ్రామ పెద్దలకి వాగ్దానం చేసి పంపేసాడు.

కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఒక మంత్రిని పిలిచి ఇలా అన్నాడు. మంత్రి వర్యా! మీరు అవసరమైన ఆ ధనాన్ని, పనివాళ్ళని తీసుకొని సబ్బవరం గ్రామానికి వెళ్ళి, అక్కడ ఒక పాఠశాల భవనం నిర్మించి రండి. దానికి ఆ మంత్రి సరేనని కావాల్సివ ధనం మనుషుల్ని తీసుకొని సబ్బవరం బయలుదేరాడు.

ఆ తర్వాత సబ్బవరం గ్రామ పెద్దలు చూపించిన విశాలమైన ఖాళీ స్థలంలో భారీపరిమాణంలో ఉండే ఒక పాఠశాల భవనాన్ని నిర్మించటం మొదలు పెట్టించాడు ఆ మంత్రి. పునాదులు లేచాయి.

ఆ తర్వాత గొడలు కట్టబడ్డాయి. అయితే ఈలోగా ఒక సంఘటన జరిగింది. అదేమంటే ఆ భవన నిర్మాణం జరిగే స్థలానికి దగ్గరలో ఒక నేరేడు చెట్టు ఉన్నది. ఆ చెట్టుపై చాలా కోతులు పగలంతా ఆడుకుంటూ, నేరేడు కాయలు తింటూ కాలక్షేపం చేస్తుంటాయి. అయితే ప్రక్క స్థలంలో జరుగుచున్న భవన నిర్మాణం చూసి ఆ కోతులు ఆసక్తిగా అటువైపు వెళ్తు ఉండేవి. కోతుల వల్ల ఎలాంటి ప్రమాదం రాదు కనుక భవన కార్మికులు ఈ కోతుల్ని ఆవతలకి తొలటం కానీ, వాటిపైకి రాళ్ళు విసరటం కానీ చేసేవాళ్ళుకాదు. 

పైగా వాళ్ళు తినే ఆహారంలో కొంత భాగం ఆ కోతులకి వేసి ఆనందించేవాళ్ళు. ఒక రకంగా అక్కడున్న కోతుల చర్యల్ని ఆ నిర్మాణ కూలీలు వినోదంగా భావించేవాళ్ళు.

ఇలా కాలం జరుగుతున్నది. ఆ భవనం పైకప్పు వేసేరోజు వచ్చింది. ఆ కాలంలో భవనానికి కప్పు వేయటానికి ముందు, భారీపరిమాణంలో ఉండే దుంగలను గొడలపై అడ్డంగా పరిచి ఆపై సున్నం, ఇసుక లాంటివి కలిపి రాళ్ళతో ఆ దుంగలపై కప్పువేసే వాళ్ళు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు ఇద్దరు కూలీలు ఒక పెద్ద చెట్టు దుంగని రంపంతో అడ్డంగా కోస్తున్నారు.

మధ్యాహ్నం అయేసరికి భోజనం చెయ్యటానికి వెళ్ళాలని ఆ ఇద్దరు పనివాళ్ళు భావించారు. కానీ దుంగని సగమే కోసి ఉండటం వలన ఆ దుంగని కోసిన ప్రాంతంలో ఒక బలమైన కర్రని రెండు చీలికల మధ్య ఉంచి, ఆహారం తీసుకోవటం కోసం వెళ్ళిపోయారు.

వాళ్ళు అలా వెళ్ళారో లేదో, ఒక డజను కోతులు ఆ ప్రదేశానికి వచ్చి అక్కడున్న నిర్మాణా పరికరాలతో ఆడుకోసాగాయి. కొన్ని కోతులు అక్కడున్న కొడవళ్ళు తీసుకొని అటు, ఇటు ఊపాయి. కొన్ని కోతులు అక్కడ వరుసగా పెట్టిన చెక్కలపై ఎక్కి గెంతసాగాయి. ఒక పిల్ల కోతి మాత్రం దూరంగా సగం కోసి ఉంచబడిన చెట్టు దుంగ దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూసింది.

ఆ తర్వాత ఆ కొయ్య దుంగపై ఎక్కి క్రిందికి దూకింది. ఆపై ఆ దుంగలో చీలిక ఉన్న ప్రాంతంలో కాళ్ళు పెట్టి సగం వరకూ కోసిన దుంగ మళ్ళీ దగ్గరగా రాకుండా ఉండటానికి పనివాళ్ళు ఆ చీలిక మధ్య ఉంచిన శీలపై చేతులు వేసి ఆ శీలను అటు, ఇటు ఊపసాగింది.

ఆ శీల చాలా బలంగా ఉండటం వల్ల ఊడి రాలేదు. దాంతో ఆ పిల్లకోతి తన బలం అంతా ఉపయోగించి రెండు చేతులతో ఆ శీలను బలంగా ఉపసాగింది.

ఇంతలో ఆ కోతి ఖర్మకాలి ఆ శీల ఊడి కోతి చేతికి వచ్చింది. శీల అలా బయటికి వచ్చిందో లేదో రెండు చీలి ఉన్న ఆ దుంగ ఢాంమన్న శబ్దంతో ఒకటిగా అతుకున్నది. పిల్లకోతి ఒక్కసారిగా బిగ్గరగా అరిచి ప్రాణం వదిలింది.

ఈ హడావుడికి భోజనాలు చేస్తున్న పనివాళ్ళు పరిగెత్తుకు వచ్చి చూసారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వాళ్ళకి దిమ్మతిరిగింది. ఏముంది అక్కడా? దుంగ చీలికల మధ్య ఉంచిన శీలను పీకిన కోతి క్రింద భాగం చితికి పోయింది. తనకు సంబంధంలేని విషయంలో అతి ఉత్సాహం ప్రదర్శించిన పిల్లకోతి నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయింది.

నీతి : ముందుచూపు లేకుండా ఏ పనీ చేయరాదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...