ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తొందరపాటు తనం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నల్లూరు అనే గ్రామంలో రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ ఊరి దేవాలయంలో పూజారిగా పని చేస్తూ ఉండేవాడు. రామశాస్త్రి అప్పుడప్పుడు ఆ ఊరి ప్రజలు తమ ఇళ్ళల్లో చేసుకొనే వ్రతాలు, పూజలను జరిపించి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి సంభావనలు తీసుకుంటూ కాలం గడిపేవాడు.

రామశాస్త్రి భార్య సీతమ్మ ఆమె భర్త తెచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ ఉండేది. అయితే రామశాస్త్రి దంపతులకు ఉన్న ఏకైక బాధ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి పెండ్లి అయ్యి 10 సం॥ములు గడిచినా సంతాన భాగ్యం కలగలేదు. దాంతో రామశాస్త్రి ఆయన భార్య ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. తీర్థయాత్రలు చేసి అనేక మంది దేవుళ్ళకి మ్రొక్కుకున్నారు. చివరికి వాళ్ళ పూజలు ఫలించి రామశాస్త్రి భార్య సీతమ్మ ఒక పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది.

లేకలేక కలిగిన ఆ మగ బిడ్డకు ఏ లోపం కలగకుండా ఆ బిడ్డను పెంచసాగారు. రామశాస్త్రి ఇంట్లో ఒక ముంగిసని చాలా కాలంగా పెంచుకుంటున్నాడు. ముంగిస అంటే తెలుసు కదూ! అది ఉడత జాతికి చెందిన పెద్ద పరిమాణంలో ఉండే ప్రాణి. ముంగిసకు, పాముకి ఆజన్మ విరోధం ఉంది. ఎప్పుడైనా పాము, ముంగిస ఎదురెదురు పడి పోట్లా డుకుంటే ముంగిస తనతో పోరాడుతున్న పాముని కొరికి ముక్కలు చేసి చంపేస్తుంది. ఆ రోజుల్లో గ్రామాల్లో పాముల బెడద ఎక్కువగా ఉండేది. అందువల్ల రామశాస్త్రి పాముల నుండి రక్షణకు గాను ముంగిసను పెంచుతూ ఉండేవాడు.

రామశాస్త్రి కుమారుడికి సంవత్సరం వయస్సు వచ్చింది. రామశాస్త్రి ఇంట్లో పెరుగుచున్న ముంగిస ఆ పసి బిడ్డకు మంచి స్నేహితురాలయ్యింది. ఒక రోజు సీతమ్మ ఆ ఊర్లో ఒకరి ఇంట్లో జరుగుచున్న పేరంటానికి వెళ్ళింది. బిడ్డను రామశాస్త్రికి అప్పగించి ఆమె వెళ్ళింది.

రామశాస్త్రి బిడ్డను ఎత్తుకొని ఆడిస్తున్నాడు. ఇంతలో ఆ ఊరి పెదకామందుగారి పాలేరు రామశాస్త్రి ఇంటికి వచ్చి కామందు గారి ఇంట్లో పూజ జరిపించటానికి రమ్మని ఆహ్వానించాడు. రామశాస్త్రి ఆలోచనలో పడ్డాడు.

ఒకప్రక్క భార్య బిడ్డను తనకు అప్పగించి పేరంటానికి వెళ్ళింది. తను బిడ్డను చూసుకుంటున్నాడు. బిడ్డకోసం, పూజ చేయించటానికి కామందుగారి ఇంటికి వెళ్ళకపోతే ఆయనకు కోపం వస్తుంది. దాంతో రామశాస్త్రికి ఒక ఉపాయం తట్టింది.

పసి బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి ముంగిసను ఆ బిడ్డకు కాపలాగా ఉంచి పూజ చేయించటానికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక పెద్ద త్రాచుపాము పసిబిడ్డ ఉన్న ఉయ్యాల దగ్గరకు వచ్చింది. అది చూసిన ముంగిస ఆ పాము పైకి పోరాటానికి దిగింది. పాము, ముంగిస దారుణంగా పోరాడుకున్నాయి. చివరికి ముంగిస, పాముని ముక్కలు చేసి చంపేసింది. కాసేపటికి రామశాస్త్రి భార్య ఇంటికి తిరిగి వచ్చింది.

ఇంట్లో బిడ్డ ఉయ్యాల క్రింద రక్తము మడుగు కనిపించింది. అది చూసి ఆమె తాము పెంచుకుంటున్న ముంగిస తమకు లేకలేక కలిగిన బిడ్డను కొరికి చంపేసిందని అపార్థం చేసుకున్నది. దాంతో సీతమ్మ పట్టలేనంత ఆగ్రహంతో ఆ ముంగిసను రోకలి బండతో కొట్టి చంపింది.

పాపం తన యజమాని కొడుకుని కాపాడుట కోసం త్రాచుపాముని చంపిన ఆ ముంగిస యజమాని భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయింది. కాసేపటికి రామశాస్త్రి పూజచేయించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కుర్చుని ఉన్న భార్య కనిపించింది. దాంతో కంగారు పడిని రామశాస్త్రి ఏం జరిగిందని భార్యని అడిగాడు. భార్య ఇలా చెప్పింది.

మన బిడ్డను కాపాడటానికి బిడ్డ ఉయ్యాల దగ్గరకు వచ్చిన త్రాచుపామును మన పెంపుడు ముంగిస చంపేసింది. నేను వచ్చి చూసేసరికి ఇల్లంతా రక్తం కనిపించి మన బిడ్డను ముంగిస చంపేసిందని అపార్థం చేసుకొని దానిని అన్యాయంగా కొట్టి చంపాను.

మన బిడ్డ ప్రాణం కాపాడిన ఈ ముంగిస ప్రాణం తీసి చాలా పాపం చేశాను. అని సీతమ్మ రోదించ సాగింది. రామశాస్త్రి ఇల్లంతా ఒకసారి పరిశీలించాడు. ఉయ్యాలలో బిడ్డ హాయిగా నిద్రపోతున్నాడు. ఉయ్యాల క్రింద ముంగిస చనిపోయి పడి ఉన్నది.

నీతి : ఏ విషయంలోను తొందరపాటు తనం పడకూడదు, బాగా ఆలోచించి ఏదైనా నిర్ణయించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...