ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భుజాలెక్కే భూతం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చందొలు అడవులలో “పాపాసురుడు” అనే బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వాడు పరమకూౄరుడు. తనకు లభించిన మనుషుల్ని నిర్ధాక్షిణ్యంగా నమిలి మింగేసేవాడు. వాడి కూృరత్వానికి ఎందరో బాటసారులు ప్రాణాలు పొగొట్టుకున్నారు.

ఈ రాక్షసుడు ఒక ఎత్తైన బండరాయిపై కూర్చుండి, అటువైపుగా వచ్చిపోయే మనుషుల్ని దగ్గరికి పిలిచి, చంపి తినేసేవాడు. ఇలా ఆ బ్రహ్మరాక్షసుడి దుర్మర్గాలు కొనసాగుతున్నాయి. దాంతో తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ మార్గంలో ప్రయాణించేవాళ్ళు కారు. కారణం వాళ్ళకి తెలుసు. ఆ మార్గంలో బ్రహ్మరాక్షసుడు ఉంటాడని.

ఒకరోజున రాజయ్యఅనే పల్లిటూరి వ్యక్తి నగరం నుండి, చందోలు వెళ్తూ, రెండు ఊళ్ళ మధ్యలో ఉన్న చందొలు అడవుల కుండా నడుస్తుండగా, బ్రహ్మరాక్షసుడి పిలుపు వినబడింది.

ఆ భయంకర స్వరానికి రాజయ్యకి హడలు పుట్టింది. సరే ధైర్యాని చిక్కాబట్టికొని, ఆ పిలుపు వినవచ్చిన వైపు నడిచాడు. అక్కడ పెద్ద రాతిబండ మీద తాపీగా కూర్చుని ఉన్న పాపాసురుడు కన్నించాడు.

దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడిని చూడగానే రాజయ్యకు గొంతు తడారిపోయింది భయంతో... అప్పుడు ఆ రాక్షసుడు గట్టిగా అరిచాడు.

ఓరి మానవుడా! ఏమిటి నీ పేరు అని, దడ, దడ లాడుతున్న గుండెను నిగ్రహించుకొని, వణుకుతున్న స్వరంతో, రాజయ్య అన్నాడు. అప్పుడు రాక్షసుడు, ఓహో, నీ పేరు రాజయ్య, సరే. నన్ను నీ భుజాలపై ఎక్కించుకొని చందొలు ఊళ్ళోకి తీసుకెళ్ళు అన్నాడు. ఆ మాట వినగా రాజయ్య గుండె జల్లుమన్నది. ఆ పర్వతాకారుడ్ని నేను ఎలా మోయగలను అనుకున్నాడు మనసులో...

అయినా ధైర్యంగా నటిస్తూ, చందోలు గ్రామంలో నీకేంటి పని అన్నాడు. అప్పుడు రాక్షసుడు, రేయ రాజయ్య ఈ మార్గంలో జనాలు ఎవరూ రావటం లేదు, దాంతో నాకు చాలా కాలంగా ఆహారం లేకుండా పోయింది.

నేనే చందోలు గ్రామంలో మకాం వేశాననుకో, కావాల్సినంత మందిని అక్కడే తినవచ్చు అన్నాడు.

రాక్షసుడి మాటలకి రాజయ్య ఉలిక్కి పడ్డాడు. ఓరి - నీ దుంపతెగ, నువ్వు అడవిని వదిలి, గ్రామంలో చేరితే, ఆ గ్రామంలోని జనాల్ని చంపేసి, ఆ గ్రామాన్ని స్మశానంగా మారుస్తావు అని మనసులో అనుకున్నాడు. అయినా పైకి ఏమీ అనకుండా, రాక్షసుడిని చందోలు గ్రామానికి మోసుకు వెళటానికి అంగీకరించాడు.

మోసుకు వెళ్ళను అంటే ఆ రాక్షసుడు ఇక్కడే తనని చంపిపారేస్తాడన్న భయం రాజయ్యకి ఉంది. రాజయ్య తనని భుజాలపై మోసుకొని తీసుకెళ్ళటానికి అంగీకరించగానే రాక్షసుడు, రాజయ్యను తను కూర్చున్న బండ దగ్గరకు రమ్మని పిలిచాడు.

రాజయ్య అలాగే బండ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ రాక్షసుడు గభాల్న బండ మీద నుండి దూకి, రాజయ్య భుజాలపై రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చున్నాడు.

రాజయ్య రాక్షసుడి బరువుకి ఊగిపోయాడు. కానీ నిగ్రహించుకొని స్థిరంగా నిలబడ్డాడు.

పాపాసురుడిని మోసుకుని బయలుదేరాడు రాజయ్య. రాక్షసుడి పాదాలు, రాజయ్య పొట్ట దగ్గర దాకా వచ్చాయి. రాజయ్య రాక్షసుడి కాళ్ళు పరిశీలిస్తూ చందొలు గ్రామం వైపు నడకసాగించాడు.

రాజయ్య నడుస్తునే, రాక్షసుడి కాళ్ళు, పాదాలు పరిశీలించసాగాడు. రాక్షసుడి కాళ్ళు, మడమల దాకా దృఢంగా ఉక్కు ముక్కల్లా ఉన్నా- వాడి పాదాలు మాత్రం తమలపాకుల్లా మృదువుగా ఉన్నాయి. ఇది చూసి రాజయ్యకు ఆశ్చర్యం కలిగి, ఆ మాటే రాక్షసుడ్ని అడిగాడు.

అప్పుడు రాక్షసుడు ఇలా చెప్పాడు. రేయ మానవుడా, నాకు ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఆ శాపం ప్రకారం నేను నా కాళ్ళతో నడిస్తే తల పగిలి మరణిస్తానని దాంతో నేను, నడవ కుండా, నీలాంటి వాళ్ళ భుజాలు ఎక్కి ఎటైనా వెళ్తుంటాను.

రాక్షసుడి మాటలు విన్న రాజయ్య బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ఈ రాక్షసుడు ఎట్టి పరిస్థితిలో నడిచిరాడు. కారణం వాడు నడిస్తే, ముని శాపం వలన తల పగిలి చస్తాడు. కనుక వీడిని ఎలాగైనా ఎక్కడైనా దింపితే, తను క్షేమంగా వాడి బారి నుండి తప్పించుకోవచ్చు. దాంతో ఆ రాక్షసుడిని ఎలాగైనా తన భుజాలుపై నుండి దింపాలని ఆలోచించసాగాడు. ఇంతలో వాళ్ళకి ఒక చెరువు కనిపించింది.

ఆ చెరువు చూడగానే రాక్షసుడు రేయ రాజయ్య! నన్ను చెరువులోకి తీసుకెళ్ళు స్నానం చేస్తాను అన్నాడు. సరే అని రాజయ్య రాక్షసుడిని మోసుకొని చెరులోకి దిగాడు.

రాక్షసుడు రాజయ్య భుజాల మీద నుండి చెరువులోకి ధడాల్న దూకాడు. ఆపై రాజయ్య చెరువు గట్టు మీదకి వచ్చి, చెరువులో స్నానం చేస్తున్న రాక్షసుడ్ని గమనించసాగాడు. రాక్షసుడు స్నానం చేసి సంవత్సరాలు అయినట్టుంది కాబోలు, హాయిగా ఆ చెరువులో ఈత కొడుతూ, స్నానం చేస్తున్నాడు.

సమయం చూసి రాజయ్య వేగంగా నడుచుకుంటూ చందొలు వైపు బయలుదేరాడు, అది గమినించిన రాక్షసుడు, రాజయ్యని గట్టిగా పిలిచాడు. అయినా రాజయ్య ఆ పిలుపు వినబడనట్టుగా ముందుకు సాగిపోయాడు. అలా వెళ్ళిపోతున్న రాజయ్యను ఆపాలంటే రాక్షసుడు నడిచి తీరాలి. నడిస్తే ఋషి శాపం ఫలించి తల పగిలి చస్తాడు.

కనుక రాక్షసుడు, రాజయ్యని నానా తిట్లు తిడుతూ ఆ చెరువులోనే ఉండిపోయాడు. ఆపై ఎవరు ఆ చెరువు వైపు నుండి వెళ్తున్నా, రాక్షసుడు వాళ్ళని పిలిచి, తనను బయటికి మోసుకెళ్ళమని ప్రార్థించేవాడు.

కానీ బ్రహ్మరాక్షసుడిని, కొరి, కొరి ఎవరు భుజాలకెత్తుకుంటారు. ఆ విధంగా రాజయ్య తెలివి, సమయ స్ఫూర్తి వల్ల రాక్షసుడి పీడా జనాలకి వదిలింది.

నీతి : బలం కన్నా తెలివి గొప్పది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...