ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఏనుగుని గెల్చిన కుందేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నీలగిరి అడవుల్లో గజేంద్ర అనే ఒక ఏనుగు రాజు తన మందతో కలిసి నివశిస్తూ ఉండేది. ఒకసారి అనావృష్టి పరిస్థితులు ఏర్పడి ఆ అడవిలోని పచ్చటి చెట్లలన్నీ ఎండిపోయాయి. చిన్న చిన్న నీటి గుంటల సైతం ఎండి పోయాయి.

దాంతో గజేంద్రుడికి అతని ఏనుగులకి ఆహారం, నీరు దొరకటం గగనం అయిపోయింది. దాంతో అన్ని ఏనుగులు కలిసి తమ రాజైన గజేంద్రుడి దగ్గరికి గుంపుగా వెళ్ళి ప్రస్తుతం అడవిలో ఏర్పడ్డ కరువు వాతావరణం గురించి ఈ విధంగా వివరించాయి.

ఓ రాజా! గత రెండు సంవత్సరాలుగా మన అడవిలో ఒక్క చుక్క వర్షం కూడా పడటం లేదు. ఎండాకాలంలో వర్షం అన్న మాట లేకున్నా సీతాకాలం, వర్షాకాలాల్లో సైతం వాన రాక పోవటం వల్ల ఈ అడవిలో పచ్చదనం అనేది కనుచూపు మేరలో కనిపించటంలేదు. అందువల్ల మన ఏనుగుల జాతి నీరు, ఆహారం లేకుండా అలమటించి పోతున్నాం. దానికి గజేంద్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు.

నా ప్రియమైన సోదరులారా! ప్రస్తుతం మన అడవిలో ఏర్పడ్డ అనావృష్టి పరిస్థిలులు తద్వారా ఏర్పడ్డ కరువు పరిస్థితులు నాకు తెలుసు. అయితే ఈ పరిస్థితులలో మనం ఏమి చెయ్యలో మన మంత్రిగారిని అడిగి తెసుకుందాం. అప్పుడు ఏనుగుల మంత్రి గణేశ్ లేచి నుంచొని రాజుగారికి నమస్కరించి ఇలా అన్నాడు.

ఓ ప్రభూ! నేడు మన ఏనుగుల జాతి అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది.

ఇలాంటి పరిస్థితులలో మనం నీరు, ఆహారం దొరికే ఇంకొక ప్రదేశానికి వెళ్ళటం మినహా గత్యంతరం లేదు. మంత్రి గణేశ్ మాటలకు అక్కడ సమావేశమైన ఏనుగులన్ని తమ అంగీకారాన్ని తెలిపాయి. అప్పుడు ఏనుగుల రాజు గజేంద్ర మంత్రి గణేన్ని ఇలా అడిగాడు.

మంత్రిగారూ ఎప్పుడు నీటి కరువు లేని మంచి ఆహారం లభించే ప్రదేశం ఎక్కడ ఉన్నది, ఎంత దూరంలో ఉన్నది అన్న విషయాలు మీకు తెలిస్తే చెప్పండి. అప్పుడు మంత్రి గణేశ్ ఇలా అన్నాడు. ఇక్కడికి 200 మైళ్ళు దూరంలో ఉన్న నల్లమల అడవుల్లోని చంద్రసాగరం అనే చిన్న వాగు ఉన్నది. ఆ వాగు సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగు ఒడ్డున అనేక రకాలైన ఫల వృక్షాలు ఉన్నాయి.

కనుక మనం అక్కడికి వలస వెళ్ళి నట్లైతే మన కరువు సమస్య తీరిపోతుంది. గణేశ్ సలహాకు రాజు గజేంద్రుడుతో సహా అక్కడ సమావేశమైన అన్ని ఏనుగులు హర్షధ్వానాలు చేశాయి.

ఆ తర్వాత అన్ని ఏనుగులు అంటే పిల్ల ఏనుగులతో సహా ముసలి ఏనుగుల వరకూ రాజు గజేంద్రుని వెనుకగా బయలుదేరిన వేలాది ఏనుగుల గుంపు కొన్ని వారాల పాటు ప్రయాణం చేసి నల్లమల అడవులలోని చంద్రసాగర్ని చేరుకున్నాయి.

చంద్రసాగర్ని చూడగానే ఏనుగులకి ఒక్కసారిగా ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది.

కారణం చాలా వెడల్పు కలిగి మైళ్ళు కొద్ది పొడవునా ప్రవహిస్తున్న ఆ మంచి నీటి వాగు ఆ వాగుకి రెండు వైపులా ఉన్న వెలగపండ్ల చెట్లు, మామిడి పండ్ల చెట్లు, నేరేడు పండ్ల చెట్లు చూసి ఏనుగులు విపరీతమైన ఆనందాన్ని అనుభవించాయి.

దాదాపుగా రెండు మూడేళ్ళుగా సరైన తిండి తిప్పలకు నోచుకోకుండా ఉన్న తమకు ఈ చంద్రసాగరం ఒక వరంలా కనిపించింది. దాంతో ఆ ఏనుగులన్నీ ఆ నాటి నుండి ఆ వాగు చుట్టు ప్రక్కల ఉన్న చెట్ల మధ్య నివాసం ఏర్పరచుకొని ఆ వాగులో స్నానాలు చెయ్యటం నీళ్ళతో ఆడుకోవటం లాంటి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేవి. ఇది ఇలా ఉండగా ఆ వాగు ఒడ్డునే ఉన్న కలుగుల్లో అనేక కుందేళ్ళు నివసిస్తూ ఉండేవి.

ఏనుగులు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వలస వచ్చే వరకు ఆ కుందేళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే ఏనుగులు ఆ ప్రాంతంలో విచ్చల విడిగా తిరగటం మొదలు పెట్టాయో ఆ వాగు ఒడ్డున నివసించే కుందేళ్ళకు ప్రాణాపాయం ఏర్పడింది.

అది ఎలాగంటే వాగు గట్టు పొడవునా ఉన్న బొరియల్లో నివాసం ఉంటున్న కుందేళ్ళు నీళ్ళు తాగటానికి గుంపులు గుంపులుగా వచ్చే వందలాది ఏనుగుల కాళ్ళు క్రింద పడి చనిపోసాగాయి. దాంతో కుందేళ్ళు సంఖ్య సగానికి సగం తగ్గి పోయింది.

ఒకరోజున ఏనుగులు అక్కడికి రాని సమయంలో కుందేళ్ళన్ని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశానికి కుందేళ్ళు రాణి శశికళ అధ్యక్షత వహించింది. ఆ వాగు ఒడ్డు బొరియల్లో ఉంటున్న సమస్త కుందేళ్ళు గురించి ఏం చెబుతుందో విందామని ఆసక్తిగా ఎదురు చూడసాగాయి.

అప్పుడు కుందేళ్ళ రాణి శశికళ ఇలా అన్నది. ఓ నా ప్రియమైన కుందేలు బంధువులారా! మనం నివాసం ఉంటున్న ఈ చంద్రసాగర వాగు మన పూర్వీకుడు, చంద్రుడు గురించి ఘోర తపస్సు చేసి చంద్రుడి వరంగా పొందాడు.

అలాంటి మన పూర్వీకుల ఆస్తిగా మనకి సంక్రమించిన ఈ చంద్రసాగర వాగుని ఆ భయంకరమైన ఏనుగులు ఆక్రమించివేశాయి. వాటి కాళ్ళ క్రిందపడి మన కుందేళ్ళు కొన్ని వందల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నాయి. కాబట్టి మన ప్రాణరక్షణకు ఆ ఏనుగుల్ని ఈ ప్రాంతానికి రాకుండా మీలో ఎవరైనా చేయగలరా? అని ప్రశ్నించింది.

ఆ ప్రశ్నకు సమాధానంగా ఒక ముసలి కుందేలు లేచి నుంచొని ఆ ఏనుగుల్ని ఈ వాగు ఒడ్డుకి రాకుండా నేను నిరోధించ గలను. అని ప్రకటించింది.

అప్పుడు కుందేళ్ళ రాణి శశికళ ఆ ముసలి కుందేలును దగ్గరకు పిలిచి నీవు ఆ ఏనుగుల్ని ఇక్కడకు రావటం నిరోధించ గలిగితే మన కుందేళ్ళ జాతి మొత్తం నీకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటుంది అన్నది. ఆ తర్వాత కుందేళ్ళన్ని ఎవరి బొరియలకు వాళ్ళు వెళ్ళిపోయారు.

ఆ మర్నాడు ఉదయం ఏనుగుల గుంపు చంద్రసాగరం వాగుకి తమ నివాస ప్రాంతం నుండి బయలు దేరాయి. అవి సగం దూరంలో ఉండగా వాటికి ఎత్తైన ఒక బండరాయి మీద నుంచొని ఉన్న ముసలి కుందేలు కనిపించింది.

ఏనుగుల గుంపుకు ముందుగా నడుస్తున్న రాజు గజేంద్రుడిని దగ్గరకు రమ్మని పిలిచింది ఆ ముసలి కుందేలు. తనని ఆ కుందేలు అలా రమ్మని పిలవటం ఆసక్తి కరంగా అనిపించి ఏనుగుల రాజు గజేంద్రుడు ఆ ముసలి కుందేలు ఉన్న రాయి వద్దకు వెళ్ళాడు.

50 అడుగుల ఎత్తు ఉన్న ఆ బండరాయి మీద నిలబడటం వల్ల ఆ ముసలి కుందేలు గజేంద్రుడు కన్నా ఎత్తులో ఉండటం జరిగింది. తనకు దగ్గరగా వచ్చిన గజేంద్రతో ముసలి కుందేలు ఇలా అన్నది.

"ఓయీ! గజరాజా! ఈ రోజు నుంచి నీవు, నీ పరివారం ఈ చంద్రసాగర వాగు దగ్గరకి రాకూడదు. మీరు రావటం వల్ల మీ కాళ్ళ క్రింద పడి రోజూ డజన్ల కొద్దీ కుందేళ్ళు మరణిస్తున్నాయి. కుందేలు మాటలకు ఆగ్రహించిన గజేంద్రుడు ఈ వాగు దగ్గరకు మమ్మల్ని రావద్దు అని చెప్పటానికి నీకేమి హక్కు ఉన్నది అని అన్నది.

అప్పుడు ముసలి కుందేలు ఈ చంద్రసాగర వాగు యజమాని అయిన చంద్రుడు మిమ్మల్ని ఈ వాగులోకి రావద్దని నన్ను చెప్పమన్నాడు. నా మాటలు లెక్కచెయ్యకుండా మీరు వాగులో దిగినట్లయితే ఆ చంద్రుడు మిమ్మల్ని అందరిని నాశనం చేస్తాడు అన్నది.

కుందేలు మాటలకు భయపడ్డ గజేంద్రుడు, కుందేలుతో ఇలా అన్నాడు. నేను చంద్రుడిని క్షమాణ కోరుకుంటాను ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పు.

అప్పుడు కుందేలు ఈ రోజు పౌర్ణమి కదా ఈ రోజు రాత్రికి చంద్రుడు ఈ వాగు మీదకు వస్తాడు. అప్పుడు నీవు వచ్చి ఆయన్ని క్షమించమని కోరుకో అన్నది.

ముసలి కుందేలు చెప్పినట్లుగానే, ఆ రోజు రాత్రి గజేంద్రుడు చంద్రసాగర వాగు దగ్గరికి వచ్చింది. ఆ సరికే అక్కడ ఉన్న కుందేలు గజేంద్రుడు దగ్గరకు వచ్చి అదిగో ఆ వాగు పైన చంద్రుడు ఉన్నాడు. చూడు అన్నది.

ఆ బుద్ధిలేని గజేంద్రుడు వాగులో పడ్డ చంద్రుడి నీడను చూసి, నిజంగా చంద్రుడే, ఆ వాగులో ఉన్నాడని భ్రమించింది.

ఇంతలో ఆ వాగులో అలలు ఏర్పడి అందులో కనబడుతున్న చంద్రుడి ప్రతిబింబం వణికింది. అది గజేంద్రుడు గమనించాడు. ఆ విషయాన్ని పసి గట్టిన ముసలి కుందేలు, ఓ గజేంద్రా! చంద్రుడు నిన్ను చూసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాడు.

నీవు తక్షణం ఆయన్ని క్షమాపణాలు కోరి, ఈ ప్రాంతం నుండి నీ పరివారంతో సహా వెళ్ళిపోతానని చెప్పు అన్నది. దాంతో ఆ మంద బుద్ధి గల గజేంద్రుడు చంద్రుడి నీడకు, ఒడ్డునుంచే తల వంచి క్షమాపణాలు కోరి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఆ రాత్రే గజేంద్రుడు తన పరివారంతో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళి పోయింది. దాంతో ఏనుగుల పీడవదలి, కుందేళ్ళన్నీ హాయిగా నిట్టూర్చాయి.

ఆ నాటి నుండి కుందేళన్నీ స్వేచ్ఛగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఆ చంద్రసాగర్ ఒడ్డున ఆనందంగా తిరగసాగాయి. 

నీతి : యుక్తి ఉంటే ఎంత అసాధ్యాన్ని అయినా సాధించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...