ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తొందరపాటు తనం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నల్లూరు అనే గ్రామంలో రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ ఊరి దేవాలయంలో పూజారిగా పని చేస్తూ ఉండేవాడు. రామశాస్త్రి అప్పుడప్పుడు ఆ ఊరి ప్రజలు తమ ఇళ్ళల్లో చేసుకొనే వ్రతాలు, పూజలను జరిపించి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి సంభావనలు తీసుకుంటూ కాలం గడిపేవాడు. రామశాస్త్రి భార్య సీతమ్మ ఆమె భర్త తెచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ ఉండేది. అయితే రామశాస్త్రి దంపతులకు ఉన్న ఏకైక బాధ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి పెండ్లి అయ్యి 10 సం॥ములు గడిచినా సంతాన భాగ్యం కలగలేదు. దాంతో రామశాస్త్రి ఆయన భార్య ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. తీర్థయాత్రలు చేసి అనేక మంది దేవుళ్ళకి మ్రొక్కుకున్నారు. చివరికి వాళ్ళ పూజలు ఫలించి రామశాస్త్రి భార్య సీతమ్మ ఒక పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. లేకలేక కలిగిన ఆ మగ బిడ్డకు ఏ లోపం కలగకుండా ఆ బిడ్డను పెంచసాగారు. రామశాస్త్రి ఇంట్లో ఒక ముంగిసని చాలా కాలంగా పెంచుకుంటున్నాడు. ముంగిస అంటే తెలుసు కదూ! అది ఉడత జాతికి చెందిన పెద్ద పరిమాణంలో ఉండే ప్రాణి. ముంగిసకు, పాముకి ఆజన్మ విరోధం ఉంది. ఎప్పుడైనా పాము, ముంగిస ఎదురెదురు పడి పోట్లా డుకుంటే ముంగిస తనతో పోరా...

గాడిద గుట్టు రట్టు అయింది | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం ముత్తు పల్లి అనే గ్రామంలో శీనయ్య అనే రజకుడు ఉండేవాడు. రజకుడు అంటే చాకలి అని అర్థం. ఊళ్ళో అందరి బట్టలు ఊరి చివర ఉండే పంటకాలువ ఒడ్డున ఉతికి, కాలువ గట్టున ఆరేసేవాడు ఆ శీనయ్య. ఉదయం గంజితాగి, తన గాడిద మీద మురికి గుడ్డల మూటలు పెట్టి, గాడిదను తొలుకుంటూ కాలువ గట్టుకి వెళ్ళటం, ఆ తర్వాత ఆ మురికి గుడ్డల్ని సున్నం, సబ్బు ఉపయోగించి కాలువలో శుభ్రంగా ఉతికి ఆరేసి, సాయంత్రం కాగానే ఆ బట్టలు చక్కగా మడతలు పెట్టి, మూట కట్టి మళ్ళీ గాడిదపై వేసి ఊళ్ళోకి వెళ్ళి ఉదయం బట్టలు వేసిన వాళ్ళకి ఉతికిన బట్టలు ఇచ్చి, మెల్లగా ఇంటికి చేరేవాడు. అయితే ఈ శీనయ్య పరమ పీనాశివాడు. తాను బాగా మూడు పుటలా తినేవాడు. పాపం బండచాకిరి చేసే అతని గాడిదకు సరిగా గడ్డి వేసేవాడు కాదు. ఇలా పాపం గాడిద చాలీచాలని ఆహారంతో గాడిద చాకిరీ చేస్తూ కాలం వెళ్ళదీస్తుంది. ఒకరోజు శీనయ్య దగ్గరలో ఉన్న నగరం అనే పట్టణంలో సంత జరుగుతుండటంతో సరుకులు కొందామని గాడిదను తీసుకొని బయలుదేరాడు. చాకలి శీనయ్యతో పాటు మంగలి జగ్గయ్య, గ్రామ పురోహితుడు శర్మ, ఇతర వ్యాపారులు సంతకి బయలు దేరారు. సంత అంటే ఏమిటో తెలుసా? పూర్వకాలంలో ఇప్పటిలాగా కిరాణా దుకాణాలు, షాపింగ్ హల్స్ లేవు క...

కాకి తెలివి | నీతి కథలు | Moral Stories in Telugu

ఒకానొక గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ఒక పెద్ద వేప చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద పాము పుట్ట ఉన్నది. ఆ ఊళ్ళో జనాలు నాగులచవితినాడు ఆ పాము పుట్టలో పాలు పొసి పూజలు చేస్తుండేవాళ్ళు. అందులో ఒక దుష్టబుద్ధి గల పాము ఉండేది. అదే చెట్టుపైన చిటారు కొమ్మల్లో ఒక కాకి జంట గూడుకట్టుకొని కాపురం చేస్తుండేది. కొన్నాళ్ళు గడిచాయి. ఆడ కాకి నాలుగు గుడ్లు పెట్టింది. మగ కాకి బయటికి వెళ్ళి ఆహారం తెచ్చి ఆడ కాకికి ఇస్తుండేది. ఆడ కాకి గూడు వదిలి బయటికి వెళ్ళకుండా తాను పెట్టిన గుడ్లపై కూర్చుని పొదుగుతూ ఉండేది. ఒక నెల రోజులకి కాకి గుడ్ల నుంచి చిన్న, చిన్న కాకి పిల్లలు బయటికి వచ్చాయి. నల్లగా, ముద్దుగా ఉన్న తమ పిల్లల్ని చూసి తెగ సంతోష పడ్డాయి కాకులు. మరి కాకి పిల్ల కాకికి ముద్దు అంటే అదే కదా! ఆ  ఒకరోజు ఆకాకుల జంట, పిల్లల్ని గూడులో వదిలేసి ఆహారం కోసం ఊళ్ళోకి వెళ్ళాయి. ఆ సమయం కొసమే వేచి ఉన్న క్రింద పుట్టలోని విష సర్పం చర,చారా పాకి చెట్టు మీదకు వెళ్ళింది. కాకి పిల్లలు హాయిగా గూడులో నిద్రపోతున్నాయి. వాటిని చూసిన పాము మెల్లగా పడగను ఆ కాకి గూడులో ఉంచి, ఆ గూడులో ఉన్న కాకి పిల్లల్ని గుడుక్కున మింగి, మెల్లిగా చ...

అపరిచితుడిని నమ్మరాదు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవులలో 'గజేంద్ర' అనే ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా పెద్దదిగా, మహాబలంగా ఉండేది. ఆ అడవిలో ఉండే అన్ని జంతువులు ఆ ఏనుగు ఆకారం, బలం చూసి హడలిపోయేవి. చివరికి కూౄరమృగాలైన పులి, సింహాలు కూడా గజేంద్ర దగ్గరకు కూడా వెళ్ళేవికాదు. ఇక ఆ గజరాజు దినచర్య పరమ అరాచకంగా ఉండేది. ఉదయం సూర్యోదయం కాగానే నిద్రలేచి అలా అడవి మధ్యలో ఉన్న పెద్ద కొలనులో దిగేది. ఆ తర్వాత గంటల కొద్దీ ఆ కొలనులో స్నానం చేయటం, నీళ్ళతో ఆడుకోవటం చేసేది. దాని తొండాన్ని ఆ కొలనులో ముంచి ‘బర్రున' చాలా నీళ్ళు పీల్చి, అన్ని వైపులకీ చిమ్మేది. ఆ కొలను చుట్టూ ఉన్న చెట్లపై ఆ ఏనుగు అలా . నీళ్ళు చిమ్మేసరికి ఉండే కోతులు, పక్షులపై నీళ్ళు ధారలు పడి ఊపిరి ఆడక గిల, గిలలాడి చెట్ల మీద నుంచి క్రింద పడి చచ్చేవి. ఆ తర్వాత స్నానం అయినాక, నీళ్ళ నుండి బయటికి వచ్చి తనకు నచ్చిన పెద్ద పెద్ద చెట్లను తొండంతో పెకిలించి లేతగా ఉండే చెట్ల కొమ్మల్ని హాయిగా భోంచేసేది. ఇంకా అడవిలో ఉండే పళ్ళ చెట్లను కూడా తొండంతో విరగ దీసి, ఆ చెట్ల పండ్లను తింటూ ఉండేది. ఆ ఏనుగు భారీ ఆకారం చూసి అది చేసే నిర్లక్ష్య చర్యల్ని అడ్డగించే సాహసానికి ఆ అడవిలో ఏ జంతువూ దిగలేదు...

దుష్టులతో స్నేహం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవులలో సంజీవి అనే సింహం ఉండేది. ఆ సింహం పేరుకి క్రూర మృగం అయినా చాలా మంచి గుణాలు కలిగి మంచి పేరు కలిగి ఉండేది. ఒక రకంగా ఆ అడవికి,ఆ సింహం రాజుగానే భావించవచ్చు. ఆ సింహానికి ఒక కాకి, ఒక నక్క ఒక తొడేలు మంచి స్నేహితులుగా ఉండేవి. రోజూ సాయంకాలం సింహం తన స్నేహితులతో కలిసి అడవిలో షికారు చేస్తూ, బాగా ఆకలైనప్పుడు మాత్రమే ఏదైనా జంతువును వేటాడేది. అలా సింహం చేత చంపబడ్డ జీవాన్ని కాకి, నక్క, తొడేలులతో కలిసి సింహం భుజించేది. ఒకరోజు సాయంకాలం సింహం దాని మిత్రులు అడవిలో సంచరిస్తుండగా, వాళ్ళకి ఒంటరిగా తిరుగుతున్న ఒక ఒంటె కన్పించింది. అది చూసిన సింహం, నక్కను పిల్చి ఇలా అన్నది. ఓయీ నక్క మిత్రమా!  అక్కడ ఓ ఒంటె ఒంటరిగా తిరుగుచున్నది. అది బహుశా ఎవరిదో వ్యాపారికి చెందిన ఒంటె కావచ్చు. దొవ తప్పి ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉన్నది. నీవు వెళ్ళి దాన్ని నా వద్దకు పిల్చుకు రా! దాంతో ఆ నక్క ఒంటె దగ్గరికి వెళ్ళి సింహం రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది. అప్పుడు ఒంటె సింహం దగ్గరికి వచ్చి నమస్కరించి నిల్చున్నది. అప్పుడు సింహం ఒంటెను కూడా తన మిత్రబృందంలో చేరమని ఆహ్వానించింది. ఆ అడవిలో దిక్కు, దివానం లేకుండ...

చేటు తెచ్చిన ఉత్సాహం | నీతి కథలు | Moral Stories in Telugu

సబ్బవరం అనే గ్రామంలో దేవుడి గుడి ఉంది. కానీ బడి లేదు. అందువల్ల ఆ ఊరి పిల్లలు చాలా దూరం నడిచి పట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ ఊరి పెద్దలు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారి దగ్గరకు వెళ్ళి తమ ఊరిలో ఒక పాఠశాలను నిర్మించమని ప్రార్థించారు. ఆ రాజుగారు విశాల హృదయుడే కాక, బాగా చదువుకున్నవాడు. దాంతో సబ్బవరం గ్రామంలో ఒక పాఠశాల నిర్మింస్తానని గ్రామ పెద్దలకి వాగ్దానం చేసి పంపేసాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఒక మంత్రిని పిలిచి ఇలా అన్నాడు. మంత్రి వర్యా! మీరు అవసరమైన ఆ ధనాన్ని, పనివాళ్ళని తీసుకొని సబ్బవరం గ్రామానికి వెళ్ళి, అక్కడ ఒక పాఠశాల భవనం నిర్మించి రండి. దానికి ఆ మంత్రి సరేనని కావాల్సివ ధనం మనుషుల్ని తీసుకొని సబ్బవరం బయలుదేరాడు. ఆ తర్వాత సబ్బవరం గ్రామ పెద్దలు చూపించిన విశాలమైన ఖాళీ స్థలంలో భారీపరిమాణంలో ఉండే ఒక పాఠశాల భవనాన్ని నిర్మించటం మొదలు పెట్టించాడు ఆ మంత్రి. పునాదులు లేచాయి. ఆ తర్వాత గొడలు కట్టబడ్డాయి. అయితే ఈలోగా ఒక సంఘటన జరిగింది. అదేమంటే ఆ భవన నిర్మాణం జరిగే స్థలానికి దగ్గరలో ఒక నేరేడు చెట్టు ఉన్నది. ఆ చెట్టుపై చాలా కోతులు పగలంతా ఆడుకుంటూ, నేరేడు కాయలు తింటూ కాలక్షేపం ...

పెద్దల మాట చద్ది మూట | నీతి కథలు | Moral Stories in Telugu

బిక్కవోలు అనే గ్రామంలో సత్తెమ్మ అనే వృద్ధురాలు జీవిస్తూ ఉండేది. ఆమెకు 'కామేశం' అనే మనవుడు ఉండేవాడు. సత్తెమ్మ కొడుకు కోడలు గోదావరీ నది వరదల్లో చనిపోగా పసి గుడ్డుగా ఉన్న 'కామేశాన్ని' .. గారాబంగా పెంచి పెద్ద చేసింది. ఎంత గారాబంగా పెరిగినా, కామేశం బాగా చదువుకుని, క్రమశిక్షణాతో జీవించేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కొన్నాళ్ళకి బిక్కవోలు గ్రామానికి దగ్గరగా ఉన్న పట్టణంలో ఉంటున్న ఒక సంపన్నుడి కుమార్తెను కామేశానికి ఇస్తామని పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా సత్తెమ్మకు కబురు చేసారు ఆ సంపన్నుడి బంధువులు. దాంతో సత్తెమ్మ మనవడికి ఈ విషయం చెప్పి, పట్నం వెళ్ళి పెళ్ళి కూతురిని చూసి రమ్మన్నది. సరే అని ప్రయాణానికి సిద్ధం అయ్యాడు కామేశం. అప్పుడు సత్తెమ్మ తన మనవడితో ఇలా అన్నది. నాయనా! కామేశం మనిషి ఎప్పుడూ ఒంటరిగా కొత్తచోటుకి వెళ్ళకూడదు. పోనీ నేను, నీకు తోడు వద్దామంటే నాకు కీళ్ళ నెప్పులు. అంత దూరం నడవలేను. అందువల్ల ఎవరినైనా తొడు తీసుకెళ్ళు అన్నది. ఆమె మాటల్ని తీసిపారేస్తూ కామేశం ఇలా అన్నాడు. పోబామ్మా! నీదంతా చాదస్తం నేనింకా పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు ఇరవై ఏళ్ళు వచ్చాయి తెలుసా? కామేశం మాటలకి నవ్వ...