ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Featured post

ఇటీవలి పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...

బలిదానం | నీతి కథలు | Moral Stories in Telugu | Balidhanam

కంకిపాడు అనే గ్రామంలో శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా తెలివి గలవాడు. కానీ డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కక్కూర్తి గల మనిషి. ఈ శర్మ ఏంచేసినా డబ్బు కోసమే చేస్తాడు. వడ్డీ వ్యాపారం చేసి, అధిక వడ్డీ గుంజి బాగా సంపాదించాడు. గ్రామంలో ఒక ఇల్లు, దగ్గరలో ఉన్న పట్టణంలో రెండు ఇల్లు నిర్మించుకున్నాడు. ఒకరోజు ఆ గ్రామానికి నలుగురు వ్యాపారులు వచ్చి బట్టలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అమ్మి బాగా డబ్బు సంపాదించారు. ఆ తర్వాత సంపాదించిన డబ్బుని వజ్రాలుగా మార్చి, నాలుగు వజ్రాలు కొన్నారు. ఒక్కొక్క వ్యాపారీ, ఒక వజ్రం చొప్పున తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళుండే నగరానికి తిరుగు ప్రయాణం కట్టారు. అయితే కాకతాళాయంగా శర్మ కూడా ఆ రోజే నగరానికి ప్రయాణం కట్టాడు. ముందు వ్యాపారులు నడుస్తున్నారు. వాళ్ళ వెనుకగా కాస్త దూరంలో శర్మ నడుస్తున్నాడు. ఇంతలో వాళ్ళకి ఒక అడవి ఎదురయింది. ఆ అడవిలో దొంగల బాధ అధికం అని ఆ వ్యాపారులు విని ఉన్నారు. దొంగలు ఎదురు పడి బాధిస్తే, వాళ్ళకి చిక్కాకుండా ఆ వజ్రాలని ఎలా కాపాడుకోవాలి అని ఆ వ్యాపారులు చింతించసాగారు. వాళ్ళు ఒక బావి గట్టున ఆగి దాహం తీర్చుకొన్నారు. అప్పుడు వారిలో ఒక వ్యాపారికి తట...

ఏనుగుని గెల్చిన కుందేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం నీలగిరి అడవుల్లో గజేంద్ర అనే ఒక ఏనుగు రాజు తన మందతో కలిసి నివశిస్తూ ఉండేది. ఒకసారి అనావృష్టి పరిస్థితులు ఏర్పడి ఆ అడవిలోని పచ్చటి చెట్లలన్నీ ఎండిపోయాయి. చిన్న చిన్న నీటి గుంటల సైతం ఎండి పోయాయి. దాంతో గజేంద్రుడికి అతని ఏనుగులకి ఆహారం, నీరు దొరకటం గగనం అయిపోయింది. దాంతో అన్ని ఏనుగులు కలిసి తమ రాజైన గజేంద్రుడి దగ్గరికి గుంపుగా వెళ్ళి ప్రస్తుతం అడవిలో ఏర్పడ్డ కరువు వాతావరణం గురించి ఈ విధంగా వివరించాయి. ఓ రాజా! గత రెండు సంవత్సరాలుగా మన అడవిలో ఒక్క చుక్క వర్షం కూడా పడటం లేదు. ఎండాకాలంలో వర్షం అన్న మాట లేకున్నా సీతాకాలం, వర్షాకాలాల్లో సైతం వాన రాక పోవటం వల్ల ఈ అడవిలో పచ్చదనం అనేది కనుచూపు మేరలో కనిపించటంలేదు. అందువల్ల మన ఏనుగుల జాతి నీరు, ఆహారం లేకుండా అలమటించి పోతున్నాం. దానికి గజేంద్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. నా ప్రియమైన సోదరులారా! ప్రస్తుతం మన అడవిలో ఏర్పడ్డ అనావృష్టి పరిస్థిలులు తద్వారా ఏర్పడ్డ కరువు పరిస్థితులు నాకు తెలుసు. అయితే ఈ పరిస్థితులలో మనం ఏమి చెయ్యలో మన మంత్రిగారిని అడిగి తెసుకుందాం. అప్పుడు ఏనుగుల మంత్రి గణేశ్ లేచి నుంచొని రాజుగారికి నమస్కరించి ఇలా అన్నాడు. ఓ ప్రభూ! నేడు...

చేటు తెచ్చిన సలహా | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం వేజండ్ల అనే గ్రామంలో పుల్లయ్య అనే నేత కార్మికుడు ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. పుల్లయ్య మగ్గం మీద బట్టలు నేసి, దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఉన్నంతలో హాయిగా జీవితం గడుపుతున్న పుల్లయ్యకి ఒకసారి ఒక సమస్య ఏర్పడింది. అదేంటంటే ఒకసారి అతని దగ్గరున్న మగ్గం విరిగి పోయింది. మళ్ళీ ఆ మగ్గాన్ని బాగుచేస్తేకానీ బట్టలు నేయలేడు. బట్టలు నేస్తేకానీ రోజు గడవదు. దాంతో పుల్లయ్య తన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి మగ్గం కోసం ఒక చెట్టును కొట్టి, చెక్కలు తెద్దామని అనుకున్నాడు. దాంతో ఉదయమే నిద్రలేచి, చద్దన్నం మూట కట్టుకొని, భుజాన గొడ్డలి వేసుకొని అడవికి బయలుదేరాడు. అడవికి చేరి, అక్కడున్న చెట్లను బాగా పరిశీలించాడు. ఏ చెట్టు తాలుకా చెక్క తన మగ్గానికి పనికి వస్తుందో అని. ఒక మంచి టేకు చెట్టుని ఎన్నుకొని దాన్ని నరకాటానికి గొడ్డలి ఎత్తాడు. సరిగ్గా అప్పుడు అతనికి వినబడింది ఒక మానవ స్వరం, ఆ స్వరం చెప్పిన మాట, మానవా, ఈ చెట్టుని నరకటం మానవా? పుల్లయ్య ఆశ్చర్యపడి చుట్టు చూసాడు. ఎవరూ కనబడలేదు. ఈ మాట అన్నది ఎవరో అర్థంకాక, పుల్లయ్య కాస్సేపు అలానే నిల్చుని, మళ్ళీ చెట్టు నరకటానికి గొడ...

నాగ పుత్రుడు | నీతి కథలు | Moral Stories in Telugu

ముమ్మిడివరం అనే గ్రామంలో భట్టుమూర్తి అనే వేదపండితుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. భట్టుమూర్తి నాలుగు వేదాలు, అష్టాదశ పురాణాలు జోపాసనపట్టిన మహామేధావి. ఆ దేశాన్ని పాలించే రాజుగారు సైతం భట్టుమూర్తిని గౌరవించేవారు. అనేక సార్లు భట్టుమూర్తికి రాజుగారు సన్మానాలు చేసారు. దాంతో భట్టుమూర్తికి డబ్బు, బంగారం విపరీతంగా పోగుపడింది. భట్టుమూర్తి దంపతులకి అన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకున్న ఏకైక లోటు సంతానం లేదు. ఆ దంపతులు పిల్లలు కలగాలని ఎందరో దేవుళ్ళకి మొక్కుకున్నారు. పుణ్యక్షేత్రాలు తిరిగారు. కానీ ఫలితం శూన్యం. ఒక రోజు భట్టుమూర్తి ఆ ఊరి అమ్మవారి గుడిలో రామాయణం పురాణం చెపుతుండగా, ఒక ఆయన వద్దకు వచ్చి ఇలా అడిగింది. "అయ్యా పంతులుగారు! పిల్లలు లేని దశరథుడు ఏదో యాగం చేస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టారని విన్నాను. ఆ యాగం పేరు ఏమిటో చెపుతారా?” ఆ ఆగంతకురాలు అడిగిన ప్రశ్నకు భట్టుమూర్తి ఉలిక్కి పడ్డాడు. కారణం తనకే పిల్లలు లేరు. తను కూడా ఏదైనా యాగం చేస్తే పిల్లలు పుడతారేమో... అన్న ఆలోచనలో ఉన్నాడు. అయితే ఏ యాగం చెయ్యాలి అన్న విషయం అతనికి స్పష్టంకాలేదు. తన మనస్సులోకి సందేహాన్ని ఆ స్త్రీ అడగటం ...